నేపాల్ వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతు: విదేశాంగ శాఖ

288 Indians missing in Nepal floods says Ministry of External Affairs
  • తమిళనాడుకు చెందిన 21 మందిని సురక్షితంగా కాపాడిన అధికారులు
  • టిబెట్‌లోనూ 200 మంది భారతీయుల సహాయ అభ్యర్థన
  • నేపాల్ అధికారులతో భారత రాయబార కార్యాలయం సంప్రదింపులు
పొరుగు దేశం నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా 288 మంది భారతీయులు గల్లంతయ్యారని భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) గురువారం వెల్లడించింది. ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విదేశాంగ శాఖ, సహాయక చర్యల నిమిత్తం నేపాల్ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపింది.

విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇప్పటివరకు 21 మంది భారతీయులను సురక్షితంగా రక్షించినట్లు తెలిపారు. బాధితులంతా తమిళనాడుకు చెందిన వారని ఆయన స్పష్టం చేశారు. గల్లంతైన వారి ఆచూకీ కనిపెట్టేందుకు నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని ఆయన వివరించారు.

ఇదిలా ఉండగా, టిబెట్‌లో చిక్కుకున్న సుమారు 200 మంది భారతీయులు సైతం సహాయం కోసం విజ్ఞప్తి చేసినట్లు జైస్వాల్ వెల్లడించారు. వారిని సురక్షితంగా తరలించేందుకు అవసరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. గల్లంతైన వారి గురించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని, సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది.
Advertisement
Nepal Floods
Indians Missing
Ministry External Affairs
Randhir Jaiswal
Tibet Stranded Indians
Tamil Nadu Tourists

More Telugu News