వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్ పొడిగింపు

Vallabhaneni Vamsi remand extended
  • ఈనెల 17 వరకు వంశీ రిమాండ్ పొడిగింపు
  • సీఐడీ పీటీ వారెంట్ పై విచారణ జరిపిన కోర్టు
  • రేపు తీర్పును వెలువరించే అవకాశం
సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేశారనే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్ ను విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు మరోసారి పొడిగించింది. ఈనెల 17 వరకు రిమాండ్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వంశీపై సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ ను కోర్టు విచారించింది. కేసు విచారణ సందర్భంగా వంశీని కోర్టు వర్చువల్ గా విచారించింది. దీనిపై కోర్టు రేపు తీర్పును వెలువరించే అవకాశం ఉంది. 

దీంతో పాటు బ్యారక్ మార్చాలంటూ వంశీ వేసిన పిటిషన్ ను కూడా కోర్టు విచారించింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
Go Back to Shorts
Vallabhaneni Vamsi
YSRCP

More Telugu News