తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ సైగ... భగ్గుమన్న డీఎంకే
- తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ సైగలపై తీవ్ర వివాదం
- స్టాలిన్ దవడ పగిలిందంటూ ఎగతాళి చేశారని డీఎంకే ఆరోపణ
- తన సైగ ఉద్దేశపూర్వకం కాదంటూ 'ఎక్స్'లో విజయ్ వివరణ
- విజయ్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించేందుకు స్పీకర్ నిరాకరణ
- సభలో గౌరవం లోపించిందంటూ స్టాలిన్ వ్యాఖ్య
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ చేసిన ఒక సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు, సైగలపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది 'బాడీ షేమింగ్' కిందకే వస్తుందని ఆరోపిస్తూ ఆ పార్టీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు.
సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడుతూ, ఎమర్జెన్సీ సమయంలో 'మిసా' చట్టం కింద స్టాలిన్ అరెస్ట్ అయిన ఉదంతాన్ని ప్రస్తావించారు. ఈ క్రమంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి మాట్లాడటం వివాదాస్పదమైంది. అత్యవసర పరిస్థితి కాలంలో పోలీసుల దాడిలో స్టాలిన్ దవడ పగిలిందన్న విషయాన్ని ముఖ్యమంత్రి ఎగతాళి చేశారని డీఎంకే నేతలు ఆరోపించారు.
ముఖ్యమంత్రి విజయ్ వ్యాఖ్యలను సభాపతి రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ డీఎంకే ఎమ్మెల్యేలు స్పీకర్ జేసీడీ ప్రభాకర్ చాంబర్ ఎదుట బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మార్షల్స్ వారిని బలవంతంగా బయటకు పంపాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇతరుల శారీరక స్థితిని హేళన చేయడం అత్యంత దారుణమని సీపీఎం నేత పి. షణ్ముగం ఖండించారు.
ఈ వివాదంపై ముఖ్యమంత్రి విజయ్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. "ప్రసంగించే క్రమంలో అనుకోకుండా నా బాడీ లాంగ్వేజ్ అలా వచ్చింది తప్ప, అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. వ్యక్తిగతంగా ఎవరినీ కించపరిచే ఉద్దేశం నాకు లేదు. దీనిని హేళనగా భావించవద్దని కోరుతున్నాను" అని ఆయన తన పోస్టులో వివరణ ఇచ్చారు.
అయితే, ముఖ్యమంత్రి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించేందుకు స్పీకర్ ప్రభాకర్ నిరాకరించారు. మరోవైపు, స్టాలిన్ను అసలు 'మిసా' కింద అరెస్ట్ చేయలేదని, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారనే కారణంతోనే అరెస్ట్ చేశారని రాష్ట్ర మంత్రి సీటీఆర్ నిర్మల్ కుమార్ వాదించారు. ఈ పరిణామాల నేపథ్యంలో, అసెంబ్లీ తన గౌరవ మర్యాదలను కాపాడుకుంటూ నడుస్తోందా? అని ఎం.కె. స్టాలిన్ ప్రశ్నించారు.
సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడుతూ, ఎమర్జెన్సీ సమయంలో 'మిసా' చట్టం కింద స్టాలిన్ అరెస్ట్ అయిన ఉదంతాన్ని ప్రస్తావించారు. ఈ క్రమంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి మాట్లాడటం వివాదాస్పదమైంది. అత్యవసర పరిస్థితి కాలంలో పోలీసుల దాడిలో స్టాలిన్ దవడ పగిలిందన్న విషయాన్ని ముఖ్యమంత్రి ఎగతాళి చేశారని డీఎంకే నేతలు ఆరోపించారు.
ముఖ్యమంత్రి విజయ్ వ్యాఖ్యలను సభాపతి రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ డీఎంకే ఎమ్మెల్యేలు స్పీకర్ జేసీడీ ప్రభాకర్ చాంబర్ ఎదుట బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మార్షల్స్ వారిని బలవంతంగా బయటకు పంపాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇతరుల శారీరక స్థితిని హేళన చేయడం అత్యంత దారుణమని సీపీఎం నేత పి. షణ్ముగం ఖండించారు.
ఈ వివాదంపై ముఖ్యమంత్రి విజయ్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. "ప్రసంగించే క్రమంలో అనుకోకుండా నా బాడీ లాంగ్వేజ్ అలా వచ్చింది తప్ప, అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. వ్యక్తిగతంగా ఎవరినీ కించపరిచే ఉద్దేశం నాకు లేదు. దీనిని హేళనగా భావించవద్దని కోరుతున్నాను" అని ఆయన తన పోస్టులో వివరణ ఇచ్చారు.
అయితే, ముఖ్యమంత్రి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించేందుకు స్పీకర్ ప్రభాకర్ నిరాకరించారు. మరోవైపు, స్టాలిన్ను అసలు 'మిసా' కింద అరెస్ట్ చేయలేదని, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారనే కారణంతోనే అరెస్ట్ చేశారని రాష్ట్ర మంత్రి సీటీఆర్ నిర్మల్ కుమార్ వాదించారు. ఈ పరిణామాల నేపథ్యంలో, అసెంబ్లీ తన గౌరవ మర్యాదలను కాపాడుకుంటూ నడుస్తోందా? అని ఎం.కె. స్టాలిన్ ప్రశ్నించారు.