Padmavathi Express: కదులుతున్న రైల్లో దోపిడీ.. పద్మావతి ఎక్స్ ప్రెస్ లో దొంగల బీభత్సం

Padmavathi Express Robbery Incident Reported in Nellore
షార్ట్స్‌లో చూడండి
సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో శనివారం దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. నెల్లూరు జిల్లా కావలి-శ్రీవెంకటేశ్వర పాలెం మధ్య ప్రయాణిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పద్మావతి ఎక్స్‌ప్రెస్ తిరుపతికి బయలుదేరింది. మార్గమధ్యంలో, కావలి దాటి శ్రీవెంకటేశ్వర పాలెం సమీపంలోకి రాగానే, గుర్తుతెలియని దుండగులు రైలులోని మూడు బోగీల్లోకి ప్రవేశించారు.

నిద్రపోతున్న ముగ్గురు మహిళా ప్రయాణికుల మెడలోంచి సుమారు 40 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగలు లాక్కెళ్లారు. వారి వద్ద ఉన్న రూ.20,000 నగదు, ఒక సెల్‌ఫోన్‌ను కూడా అపహరించారు. తెల్లవారుజామున జరిగిన ఈ హఠాత్పరిణామంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

దోపిడీ అనంతరం దొంగలు రైలు నుంచి దూకి పరారైనట్లు తెలుస్తోంది. బాధితులు వెంటనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుల వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ముమ్మరం చేశారు.
Go Back to Shorts
Padmavathi Express
Padmavathi Express Robbery
Train Robbery
Nellore
Kavali
Sri Venkateswara Palem
Theft
Gold Jewelry
Railway Police

More Telugu News