దులీప్ ట్రోఫీ: వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్సీ
- దులీప్ ట్రోఫీ 2026 కోసం ఈస్ట్ జోన్ జట్టును ప్రకటించిన సెలక్టర్లు
- కెప్టెన్ గా ఇషాన్ కిషన్
- సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ తిరిగి జట్టులోకి పునరాగమనం
- అనుభవం, యువత కలయికతో పటిష్టంగా కనిపిస్తున్న జట్టు
దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ దులీప్ ట్రోఫీ 2026 కోసం ఈస్ట్ జోన్ తమ 15 మంది సభ్యులతో కూడిన జట్టును బుధవారం ప్రకటించింది. భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా, 15 ఏళ్ల యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్ పదవిని కట్టబెట్టడం విశేషం. ఈ టోర్నమెంట్ ఆగస్టు 23న బెంగళూరులో ప్రారంభం కానుంది.
ఇటీవల జింబాబ్వేతో జరిగిన సిరీస్లో ఇషాన్ కిషన్ అద్భుత ఫామ్లో కనిపించాడు. అతడి దూకుడైన ఆటతీరు, నాయకత్వ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని సెలక్టర్లు ఈ కీలక బాధ్యతను అప్పగించారు. మరోవైపు, అందరి దృష్టి ఇప్పుడు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. బీహార్ నుంచి భారత జాతీయ జట్టులో స్థానం సంపాదించిన వైభవ్, ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో రాణించిన సంగతి తెలిసిందే. తన నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న అతడికి, ఇంత చిన్న వయసులోనే దేశవాళీ క్రికెట్లో వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం గమనార్హం.
ఈ జట్టులో అనుభవానికి, యువతకు సమాన ప్రాధాన్యతనిచ్చారు. సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ దేశవాళీ క్రికెట్లోకి పునరాగమనం చేయడం బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేయనుంది. అతడికి ముఖేష్ కుమార్ తోడుగా ఉండనున్నాడు. అభిమన్యు ఈశ్వరన్, షాబాజ్ అహ్మద్, అనుకుల్ రాయ్ వంటి ఆల్రౌండర్లతో జట్టు సమతూకంగా, పటిష్ఠంగా కనిపిస్తోంది.
ఈస్ట్ జోన్ జట్టు: ఇషాన్ కిషన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ (వైస్ కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, సుదీప్ కుమార్ ఘరామి, షాబాజ్ అహ్మద్, సూరజ్ సింధు జైస్వాల్, మహమ్మద్ షమీ, ముఖేష్ కుమార్, కుమార్ కుషాగ్రా, శిఖర్ మోహన్, అనుకుల్ రాయ్, విరాట్ సింగ్, సుభాన్షు సేనాపతి, దేనిష్ దాస్, అభిజిత్ సర్కార్.
స్టాండ్ బై: ఆయుష్ లోహరుక, శ్రీదామ్ పాల్, సంబిత్ ఎస్. బరల్, శరణ్దీప్ సింగ్, స్వస్తిక్ సమల్.
ఇటీవల జింబాబ్వేతో జరిగిన సిరీస్లో ఇషాన్ కిషన్ అద్భుత ఫామ్లో కనిపించాడు. అతడి దూకుడైన ఆటతీరు, నాయకత్వ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని సెలక్టర్లు ఈ కీలక బాధ్యతను అప్పగించారు. మరోవైపు, అందరి దృష్టి ఇప్పుడు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. బీహార్ నుంచి భారత జాతీయ జట్టులో స్థానం సంపాదించిన వైభవ్, ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో రాణించిన సంగతి తెలిసిందే. తన నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న అతడికి, ఇంత చిన్న వయసులోనే దేశవాళీ క్రికెట్లో వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం గమనార్హం.
ఈ జట్టులో అనుభవానికి, యువతకు సమాన ప్రాధాన్యతనిచ్చారు. సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ దేశవాళీ క్రికెట్లోకి పునరాగమనం చేయడం బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేయనుంది. అతడికి ముఖేష్ కుమార్ తోడుగా ఉండనున్నాడు. అభిమన్యు ఈశ్వరన్, షాబాజ్ అహ్మద్, అనుకుల్ రాయ్ వంటి ఆల్రౌండర్లతో జట్టు సమతూకంగా, పటిష్ఠంగా కనిపిస్తోంది.
ఈస్ట్ జోన్ జట్టు: ఇషాన్ కిషన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ (వైస్ కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, సుదీప్ కుమార్ ఘరామి, షాబాజ్ అహ్మద్, సూరజ్ సింధు జైస్వాల్, మహమ్మద్ షమీ, ముఖేష్ కుమార్, కుమార్ కుషాగ్రా, శిఖర్ మోహన్, అనుకుల్ రాయ్, విరాట్ సింగ్, సుభాన్షు సేనాపతి, దేనిష్ దాస్, అభిజిత్ సర్కార్.
స్టాండ్ బై: ఆయుష్ లోహరుక, శ్రీదామ్ పాల్, సంబిత్ ఎస్. బరల్, శరణ్దీప్ సింగ్, స్వస్తిక్ సమల్.