రేపు ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన

Andhra Pradesh Weather Forecast For Tomorrow
  • కోస్తా, రాయలసీమలో మోస్తరు వానల అంచనా
  • గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
  • ఉరుముల సమయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచన
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లుల పడటంతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రధానంగా పోలవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడతాయని అంచనా వేశారు. 

మార్కాపురం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి చినుకులు పడే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు.

వర్షం కురిసే సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో పాటు గాలులు బలంగా వీస్తున్నప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా చెట్ల కింద, భారీ హోర్డింగుల సమీపంలో నిలబడకూడదని, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
Advertisement
Andhra Pradesh
AP Rain Forecast
APSDMA Weather Alert
Coastal Andhra Rains
Prakhar Jain APSDMA

More Telugu News