వచ్చే టీ20 వరల్డ్ కప్నకు అమెరికా ఆతిథ్యం.. భారత్–పాక్ మ్యాచ్ ఎక్కడంటే..!
- వెస్టిండీస్తో పాటు అమెరికాకు ఆతిథ్య హక్కులు కేటాయించిన ఐసీసీ
- ఫ్లోరిడా, డల్లాస్, న్యూయార్క్లో జరగనున్న మ్యాచ్లు
- న్యూయార్క్లోని ఐసన్ హోవర్ పార్క్ స్టేడియంలో దాయాదుల మ్యాచ్ జరిగే అవకాశం
వచ్చే ఏడాది జరిగే టోర్నీలో మొత్తం 20 జట్లు బరిలోకి దిగనున్నాయి. ఎక్కువ మంది ప్రేక్షకులు హాజరయ్యేలా ఫ్లోరిడా, డల్లాస్ క్రికెట్ స్టేడియాల సామర్థ్యం పెంచేందుకు ఐసీసీ కృషి చేయనుంది. న్యూయార్క్లోని ఐసన్ హోవర్ పార్క్ స్టేడియంలో భారత్–పాకిస్థాన్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఈ స్టేడియం కెపాసిటీని పెంచి 34 వేల సీట్లను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామని ఐసీసీ వెల్లడించింది.