ఉప్పల్లో వరల్డ్ కప్ మ్యాచ్: పాకిస్థాన్–న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్ కు ఫ్యాన్స్కు నో ఎంట్రీ!
- ఈ నెల 29న ఖాళీ స్టేడియంలో జరగనున్న
పాకిస్థాన్–న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్ - 28న గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ నేపథ్యంలో భద్రత ఇవ్వలేమన్న పోలీసులు
- ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ నిర్వహించాలని అధికారుల నిర్ణయం
ఇదే విషయాన్ని బీసీసీఐకి తెలిపిన హెచ్సీఏ మ్యాచ్ను ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి బీసీసీఐ కూడా సూత్రప్రాయంగా అంగీకరించింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు తిరిగి చెల్లించనున్నారు. కాగా, అక్టోబర్ 3న ఆస్ట్రేలియా–పాక్ వార్మప్తో పాటు మూడు వరల్డ్ కప్ మ్యాచ్లు ఫ్యాన్స్ మధ్యన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు.