Ashok Gajapathi Raju: ఏపీ ప్ర‌భుత్వానికి మంచి బుద్ధి రావాల‌ని కోరుకున్నాను: అశోక్ గ‌జ‌ప‌తి రాజు

ashok gajapati raju slams ap govt
షార్ట్స్‌లో చూడండి
విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని పైడిత‌ల్లి అమ్మ‌వారి ఉత్స‌వాలు నిన్న సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా ప్రారంభ‌మయ్యాయి. క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ ఈ ఉత్స‌వాలు నిర్వ‌హించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. నిన్న రాత్రి అమ్మ‌వారి మూల విరాట్‌కు క్షీరాభిషేకం చేశారు. సిరిమానోత్స‌వాన్ని సంప్ర‌దాయబ‌ద్ధంగా కొన‌సాగిస్తామ‌ని పూజారులు తెలిపారు.

ఉత్స‌వాల సంద‌ర్భంగా ఈ రోజు ఉద‌యం కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్ అశోక్ గ‌జ‌ప‌తిరాజు అమ్మ‌వారి పూజ‌ల్లో పాల్గొన్నారు. పైడిత‌ల్లిని కుటుంబ స‌మేతంగా ద‌ర్శించుకున్నారు. అశోక్ గ‌జ‌ప‌తి రాజుకు ఆల‌య మ‌ర్యాద‌ల‌తో స్వాగ‌తం ప‌లికిన పండితులు తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు.

ఈ సంద‌ర్భంగా అశోక్ గ‌జ‌ప‌తిరాజు మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌జ‌ల‌కు అన్ని విధాలా శుభం క‌ల‌గాల‌ని అమ్మ‌వారిని కోరుకున్నాన‌ని తెలిపారు. అలాగే, ఏపీ ప్ర‌భుత్వానికి మంచి బుద్ధి రావాల‌ని కోరుకున్నానని చుర‌క‌లంటించారు.  

Go Back to Shorts
Ashok Gajapathi Raju
Telugudesam
YSRCP

More Telugu News