ఉల్లి, అల్లం, వెల్లుల్లి మంట.. ఆగస్టులో పెరిగిన ద్రవ్యోల్బణం
- ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 4.82 శాతం
- ఆహార ద్రవ్యోల్బణం 5.95 శాతానికి పెరుగుదల
- వెండి ఆభరణాల ధరలు 107.11 శాతం పెరుగుదల
- భారీగా పెరిగిన ఉల్లి, అల్లం, వెల్లుల్లి ధరలు
- తగ్గిన టమాటా, బంగాళాదుంపల ధరలు
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో స్వల్పంగా పెరిగింది. కొత్త వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారంగా ఆగస్టు రిటైల్ ద్రవ్యోల్బణం 4.82 శాతంగా నమోదైంది. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ సోమవారం ఈ వివరాలను వెల్లడించింది.
ఆగస్టులో ధరలు ఎక్కువగా పెరిగిన వస్తువుల్లో వెండి ఆభరణాలు ముందున్నాయి. వీటి ధరలు ఏకంగా 107.11 శాతం పెరిగాయి. బంగారు ఆభరణాల ధరలు 35.55 శాతం పెరిగాయి. ఆహార ద్రవ్యోల్బణం కూడా 5.95 శాతానికి చేరింది.
కూరగాయల్లో ముఖ్యంగా ఉల్లి, అల్లం, వెల్లుల్లి ధరలు వినియోగదారులకు భారంగా మారాయి. ఉల్లి ధర 48.27 శాతం, అల్లం 73.82 శాతం, వెల్లుల్లి 43.60 శాతం పెరిగాయి. అయితే టమాటా ధరలు 31.09 శాతం, బంగాళాదుంపల ధరలు 13.14 శాతం తగ్గాయి.
ఇతర వస్తువుల్లో కార్ల ధరలు కూడా తగ్గాయి. ఆగస్టులో కార్ల ధరల్లో 6.72 శాతం క్షీణత నమోదైంది.
రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన 2 నుంచి 6 శాతం పరిధిలోనే ఉంది. ఈ పరిధికి మధ్యస్థ లక్ష్యం 4 శాతం. ధరల స్థిరత్వంతో పాటు ఆర్థిక వృద్ధిని సమతుల్యం చేయడం ఆర్బీఐ ద్రవ్య విధాన ఉద్దేశం.
ఇటీవల ద్రవ్య విధాన సమీక్షలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. ఇంధన ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణంలో మార్పు వచ్చిందని తెలిపారు. అయితే విస్తృత స్థాయిలో ధరల ఒత్తిడి అదుపులోనే ఉందన్నారు. వృద్ధికి ఊతమిచ్చేందుకు రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకుండా యథాతథంగా కొనసాగించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటు ద్రవ్యోల్బణ అంచనాను ఆర్బీఐ 5.1 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. ఆహారం, ఇంధన ధరలను మినహాయించే కోర్ ద్రవ్యోల్బణ అంచనాను 4.7 శాతం నుంచి 4.3 శాతానికి తగ్గించింది. ఇదే సమయంలో 2026-27 వృద్ధి అంచనాను 6.6 శాతం నుంచి 6.7 శాతానికి పెంచింది.
ఆగస్టులో ధరలు ఎక్కువగా పెరిగిన వస్తువుల్లో వెండి ఆభరణాలు ముందున్నాయి. వీటి ధరలు ఏకంగా 107.11 శాతం పెరిగాయి. బంగారు ఆభరణాల ధరలు 35.55 శాతం పెరిగాయి. ఆహార ద్రవ్యోల్బణం కూడా 5.95 శాతానికి చేరింది.
కూరగాయల్లో ముఖ్యంగా ఉల్లి, అల్లం, వెల్లుల్లి ధరలు వినియోగదారులకు భారంగా మారాయి. ఉల్లి ధర 48.27 శాతం, అల్లం 73.82 శాతం, వెల్లుల్లి 43.60 శాతం పెరిగాయి. అయితే టమాటా ధరలు 31.09 శాతం, బంగాళాదుంపల ధరలు 13.14 శాతం తగ్గాయి.
ఇతర వస్తువుల్లో కార్ల ధరలు కూడా తగ్గాయి. ఆగస్టులో కార్ల ధరల్లో 6.72 శాతం క్షీణత నమోదైంది.
రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన 2 నుంచి 6 శాతం పరిధిలోనే ఉంది. ఈ పరిధికి మధ్యస్థ లక్ష్యం 4 శాతం. ధరల స్థిరత్వంతో పాటు ఆర్థిక వృద్ధిని సమతుల్యం చేయడం ఆర్బీఐ ద్రవ్య విధాన ఉద్దేశం.
ఇటీవల ద్రవ్య విధాన సమీక్షలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. ఇంధన ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణంలో మార్పు వచ్చిందని తెలిపారు. అయితే విస్తృత స్థాయిలో ధరల ఒత్తిడి అదుపులోనే ఉందన్నారు. వృద్ధికి ఊతమిచ్చేందుకు రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకుండా యథాతథంగా కొనసాగించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటు ద్రవ్యోల్బణ అంచనాను ఆర్బీఐ 5.1 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. ఆహారం, ఇంధన ధరలను మినహాయించే కోర్ ద్రవ్యోల్బణ అంచనాను 4.7 శాతం నుంచి 4.3 శాతానికి తగ్గించింది. ఇదే సమయంలో 2026-27 వృద్ధి అంచనాను 6.6 శాతం నుంచి 6.7 శాతానికి పెంచింది.