కుటుంబంతో కలిసి గణపతి పూజలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఫొటోలు ఇవిగో!
- తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు
- కుటుంబ సభ్యులతో కలిసి గణపతికి ప్రత్యేక పూజలు
- అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగి విజయాలు రావాలని ఆకాంక్ష
- పూజకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సీఎం
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం ఆయన తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి గణపతి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీస్సులు అందుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సోషల్ మీడియా వేదికగా తన సందేశాన్ని పంచుకున్నారు. ప్రజలందరి జీవితాల్లో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి, ప్రతి ఒక్కరూ విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజులో పాల్గొన్న ఫొటోలను ఆయన ఈ సందర్భంగా షేర్ చేశారు.
"వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి గణపతి పూజా కార్యక్రమంలో పాల్గొన్నాను. ప్రజలందరి జీవితాల్లో విఘ్నాలు తొలగి, విజయాలు సిద్ధించాలని ప్రార్థిస్తూ, రాష్ట్ర ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పోస్టులో పేర్కొన్నారు.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సోషల్ మీడియా వేదికగా తన సందేశాన్ని పంచుకున్నారు. ప్రజలందరి జీవితాల్లో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి, ప్రతి ఒక్కరూ విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజులో పాల్గొన్న ఫొటోలను ఆయన ఈ సందర్భంగా షేర్ చేశారు.
"వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి గణపతి పూజా కార్యక్రమంలో పాల్గొన్నాను. ప్రజలందరి జీవితాల్లో విఘ్నాలు తొలగి, విజయాలు సిద్ధించాలని ప్రార్థిస్తూ, రాష్ట్ర ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పోస్టులో పేర్కొన్నారు.

