పురుషుల జట్టు వైఖరికే మహిళా జట్టు సంఘీభావం: బీసీసీఐ సెక్రటరీ

పురుషుల జట్టు వైఖరికే మహిళా జట్టు సంఘీభావం: బీసీసీఐ సెక్రటరీ

BCCI Secretary says Womens team shows solidarity with Mens team stance
  • ఆసియా కప్ ను గెలుచుకున్న భారత మహిళా జట్టు
  • నఖ్వీ నుంచి టైటిల్ అండుకునేందుకు నిరాకరణ
  • ఇది ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయం కాదన్న బీసీసీఐ సెక్రటరీ

దుబాయ్‌లో శ్రీలంకపై 72 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించి 8వ సారి ‘ఉమెన్స్ ఆసియా కప్ 2026’ టైటిల్‌ను గెలుచుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు, విజేత ట్రోఫీని స్వీకరించేందుకు నిరాకరించడం సంచలనంగా మారింది. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మరియు ఆ దేశ మంత్రి అయిన మొహిసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించకూడదని బీసీసీఐ (BCCI) నిర్ణయించడంతో, ప్రెజెంటేషన్ వేడుక వివాదాస్పదంగా ముగిసింది.


ఈ పరిణామంపై బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా స్పందిస్తూ వివరణ ఇచ్చారు. భారత దేశ సార్వభౌమాధికారానికి, భద్రతకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యక్తుల నుంచి ట్రోఫీలు తీసుకోలేమని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది భారత పురుషుల జట్టు గెలిచిన ఆసియా కప్ ట్రోఫీ కూడా ఇప్పటికీ భారతదేశానికి చేరుకోలేదని అన్నారు. ఆనాటి పురుషుల జట్టు నిర్ణయానికి మద్దతుగా నిలుస్తూనే మహిళా జట్టు సైతం ఈ సంఘీభావాన్ని ప్రకటించిందని వెల్లడించారు. ఇది ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయం కాదని, భారత్ అనుసరిస్తున్న వ్యూహాత్మక సంస్థాగత విధానమేనని స్పష్టం చేశారు. 

Advertisement
Devajit Saikia
Indian Womens Cricket Team
Womens Asia Cup 2026
Mohsin Naqvi
BCCI
India Pakistan Cricket Row

More Telugu News