భారత్ను కొల్లగొట్టిన జేన్ స్ట్రీట్కు భారీ షాక్.. ఒక్క నెలలో రూ.1.25 లక్షల కోట్ల నష్టం
- ఏఐ హెడ్జ్ ఫండ్లో పెట్టుబడి కారణంగా 15 బిలియన్ డాలర్లు కోల్పోయిన సంస్థ
- ఏఐ, సెమీకండక్టర్ స్టాక్స్ పతనంతో ఫండ్ పోర్ట్ఫోలియో 67 శాతం క్షీణత
- పదేళ్లలో కంపెనీకి నష్టాలు రావడం ఇదే మొదటిసారి
- నష్టాలు ఉన్నా ఈ ఏడాది ఇప్పటివరకు 40 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించిన జేన్ స్ట్రీట్
వాల్స్ట్రీట్ ట్రేడింగ్ దిగ్గజం జేన్ స్ట్రీట్ జులై నెలలో భారీ నష్టాలను చవిచూసింది. గత పదేళ్ల కాలంలో తొలిసారిగా ఒక నెలలో సుమారు 15 బిలియన్ డాలర్ల (రూ. 1.25 లక్షల కోట్ల పైచిలుకు) మేర నష్టాన్ని నమోదు చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంపై దృష్టి సారించిన 'సిచ్యుయేషనల్ అవేర్నెస్' అనే హెడ్జ్ ఫండ్లో చేసిన పెట్టుబడులే ఈ భారీ నష్టానికి ప్రధాన కారణంగా నిలిచాయి.
ఓపెన్ ఏఐ మాజీ పరిశోధకుడు లియోపోల్డ్ అషెన్బ్రెన్నర్ స్థాపించిన ఈ హెడ్జ్ ఫండ్, ఏఐ, సెమీకండక్టర్ షేర్ల పతనంతో తీవ్రంగా దెబ్బతింది. జూన్ నాటికి ఈ ఫండ్ శాన్డిస్క్లో సుమారు 5.7 బిలియన్ డాలర్లు, మైక్రాన్ టెక్నాలజీలో 5.6 బిలియన్ డాలర్ల మేర భారీగా పెట్టుబడులు పెట్టింది. అయితే జులైలో శాన్డిస్క్ షేర్లు 47 శాతం, మైక్రాన్ షేర్లు 29 శాతం మేర పడిపోవడంతో, ఈ ఫండ్ పోర్ట్ఫోలియో విలువ ఏకంగా 67 శాతం క్షీణించింది. మార్జిన్ కాల్స్ ఒత్తిడి పెరగడంతో, ఫండ్లోని పబ్లిక్ ఈక్విటీలను సిటాడెల్ సంస్థకు తక్కువ ధరకే విక్రయించాల్సి వచ్చింది.
సదరు ఫండ్లో గణనీయమైన వాటా కలిగి ఉండటంతో పాటు, ఏఐ సంబంధిత స్టాక్స్లో నేరుగా పెట్టుబడులు పెట్టడం వల్ల జేన్ స్ట్రీట్కు సుమారు 15 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ఏడాది మొత్తంగా చూస్తే ఈ పెట్టుబడిపై ఇప్పటికీ సానుకూల ఫలితాలనే పొందుతున్నామని సంస్థ తన ఉద్యోగులకు పంపిన అంతర్గత నోట్లో పేర్కొంది. ఈ భారీ నష్టం సంభవించినప్పటికీ, జూలై నాటికి ఈ ఏడాదిలో 40 బిలియన్ డాలర్లకు పైగా ట్రేడింగ్ ఆదాయాన్ని ఆర్జించినట్లు సంస్థ వెల్లడించింది.
అమెరికాకు చెందిన జేన్ స్ట్రీట్ సంస్థ భారత స్టాక్ మార్కెట్ నిబంధనలను ఉల్లంఘించి, ప్రస్తుతం దేశంలో నిషేధాన్ని ఎదుర్కొంటోంది. భారత మార్కెట్లో అక్రమ మార్గాల ద్వారా వేల కోట్ల రూపాయలు ఆర్జించినట్లు రుజువు కావడంతో సెబీ ఈ సంస్థపై కఠిన చర్యలు తీసుకుంది. స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ధరలను తారుమారు చేస్తూ మదుపరుల ప్రయోజనాలకు విఘాతం కలిగించిన జేన్ స్ట్రీట్, సుమారు రూ. 44,358 కోట్లను అక్రమంగా ఆర్జించినట్లు సెబీ నిర్ధారించింది.
ఓపెన్ ఏఐ మాజీ పరిశోధకుడు లియోపోల్డ్ అషెన్బ్రెన్నర్ స్థాపించిన ఈ హెడ్జ్ ఫండ్, ఏఐ, సెమీకండక్టర్ షేర్ల పతనంతో తీవ్రంగా దెబ్బతింది. జూన్ నాటికి ఈ ఫండ్ శాన్డిస్క్లో సుమారు 5.7 బిలియన్ డాలర్లు, మైక్రాన్ టెక్నాలజీలో 5.6 బిలియన్ డాలర్ల మేర భారీగా పెట్టుబడులు పెట్టింది. అయితే జులైలో శాన్డిస్క్ షేర్లు 47 శాతం, మైక్రాన్ షేర్లు 29 శాతం మేర పడిపోవడంతో, ఈ ఫండ్ పోర్ట్ఫోలియో విలువ ఏకంగా 67 శాతం క్షీణించింది. మార్జిన్ కాల్స్ ఒత్తిడి పెరగడంతో, ఫండ్లోని పబ్లిక్ ఈక్విటీలను సిటాడెల్ సంస్థకు తక్కువ ధరకే విక్రయించాల్సి వచ్చింది.
సదరు ఫండ్లో గణనీయమైన వాటా కలిగి ఉండటంతో పాటు, ఏఐ సంబంధిత స్టాక్స్లో నేరుగా పెట్టుబడులు పెట్టడం వల్ల జేన్ స్ట్రీట్కు సుమారు 15 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ఏడాది మొత్తంగా చూస్తే ఈ పెట్టుబడిపై ఇప్పటికీ సానుకూల ఫలితాలనే పొందుతున్నామని సంస్థ తన ఉద్యోగులకు పంపిన అంతర్గత నోట్లో పేర్కొంది. ఈ భారీ నష్టం సంభవించినప్పటికీ, జూలై నాటికి ఈ ఏడాదిలో 40 బిలియన్ డాలర్లకు పైగా ట్రేడింగ్ ఆదాయాన్ని ఆర్జించినట్లు సంస్థ వెల్లడించింది.
అమెరికాకు చెందిన జేన్ స్ట్రీట్ సంస్థ భారత స్టాక్ మార్కెట్ నిబంధనలను ఉల్లంఘించి, ప్రస్తుతం దేశంలో నిషేధాన్ని ఎదుర్కొంటోంది. భారత మార్కెట్లో అక్రమ మార్గాల ద్వారా వేల కోట్ల రూపాయలు ఆర్జించినట్లు రుజువు కావడంతో సెబీ ఈ సంస్థపై కఠిన చర్యలు తీసుకుంది. స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ధరలను తారుమారు చేస్తూ మదుపరుల ప్రయోజనాలకు విఘాతం కలిగించిన జేన్ స్ట్రీట్, సుమారు రూ. 44,358 కోట్లను అక్రమంగా ఆర్జించినట్లు సెబీ నిర్ధారించింది.