చెప్పులు పక్కన పెట్టి కాసేపు నడవండి.. ఆరోగ్యానికి ఇన్ని ప్రయోజనాలా?
- రోజూ 15-30 నిమిషాలు చెప్పులు లేకుండా నడవాలని సూచన
- పాదాల కండరాలకు మంచి వ్యాయామం లభించొచ్చని వెల్లడి
- నడకతో బాడీ బ్యాలెన్స్ మెరుగుపడే అవకాశం
- ప్రకృతిలో నడిస్తే ఒత్తిడి తగ్గొచ్చని నిపుణుల సూచన
- కాళ్లలో రక్త ప్రసరణకు మేలు జరగొచ్చని వెల్లడి
- గడ్డి, ఇసుక, శుభ్రమైన మట్టిపై నడవాలని సలహా
ఉరుకుల పరుగుల జీవితంలో నేలను తాకే అవకాశమే లేకుండా పోయింది. ఇంట్లోనూ చెప్పులేసుకుని నడిచే కాలం వచ్చేసింది. ఉదయం వాకింగ్ మొదలు.. ఆఫీసుకు వెళ్లి వచ్చే వరకు షూ లేదా చెప్పులతోనే ఎక్కువ సమయం గడిచిపోతోంది. ఇంటికి వచ్చాక కూడా చెప్పులు పక్కన పెట్టి కాసేపు నడిచే సమయం ఉండటం లేదు. అయితే రోజులో కాసేపైనా చెప్పుల్లేకుండా నడవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా నడవడం వల్ల పాదాల ఆరోగ్యంతో పాటు బాడీ బ్యాలెన్స్, ఒత్తిడి తగ్గడం వంటి పలు ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.
పాదాలకు మంచి వ్యాయామం
ఎప్పుడూ చెప్పులు లేదా షూలతో నడవడం వల్ల పాదాలు ఒకే రకమైన కదలికలకు అలవాటు పడతాయి. చెప్పులు లేకుండా నడిస్తే పాదాలు నేలకు అనుగుణంగా సహజంగా కదులుతాయి. దీంతో పాదాల్లోని చిన్న కండరాలు, స్నాయువులకు మంచి వ్యాయామం లభిస్తుంది. క్రమంగా పాదాల బలం పెరుగుతుంది.
అడుగుల్లో స్థిరత్వం
నేలను నేరుగా తాకుతూ నడవడం వల్ల అడుగు ఎలా పడుతోంది, శరీరం ఎలా కదులుతోంది అన్న దానిపై మంచి అవగాహన వస్తుంది. దీంతో నడకలో స్థిరత్వం పెరగొచ్చు. శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోవడంలోనూ ఇది ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వయసు పెరిగినవారికి ఈ అలవాటు కొంత మేలు చేయొచ్చు.
ఒత్తిడి కాస్త తగ్గొచ్చు
పచ్చిక, ఇసుక లేదా మట్టిపై చెప్పులు లేకుండా నడవడం వల్ల ప్రకృతితో అనుబంధం పెరుగుతుంది. కాసేపు ఫోన్, పని, ఇతర ఆలోచనలకు దూరంగా నడవడం మనసుకు విశ్రాంతినిస్తుంది. దీంతో ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా అనిపించొచ్చు. కొందరిలో నిద్ర కూడా మెరుగుపడే అవకాశం ఉంది.
రక్త ప్రసరణకు మేలు
నడకతో పాదాలు, కాళ్లలో కదలిక పెరుగుతుంది. దీనివల్ల కాళ్లలో రక్త ప్రసరణ మెరుగుపడటానికి సహాయపడొచ్చు.
రోజుకు అరగంట చాలు
ఈ అలవాటును మొదలుపెట్టాలనుకునేవారు రోజూ 15 నుంచి 30 నిమిషాలు కేటాయించవచ్చు. గడ్డి, ఇసుక లేదా శుభ్రమైన మట్టిపై నడవడం మంచిది. అయితే ముళ్లు, రాళ్లు, గాజు ముక్కలతో జాగ్రత్తగా ఉండాలి. పాదాలకు ఏవైనా సమస్యలున్నవారు ముందుగా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
పాదాలకు మంచి వ్యాయామం
ఎప్పుడూ చెప్పులు లేదా షూలతో నడవడం వల్ల పాదాలు ఒకే రకమైన కదలికలకు అలవాటు పడతాయి. చెప్పులు లేకుండా నడిస్తే పాదాలు నేలకు అనుగుణంగా సహజంగా కదులుతాయి. దీంతో పాదాల్లోని చిన్న కండరాలు, స్నాయువులకు మంచి వ్యాయామం లభిస్తుంది. క్రమంగా పాదాల బలం పెరుగుతుంది.
అడుగుల్లో స్థిరత్వం
నేలను నేరుగా తాకుతూ నడవడం వల్ల అడుగు ఎలా పడుతోంది, శరీరం ఎలా కదులుతోంది అన్న దానిపై మంచి అవగాహన వస్తుంది. దీంతో నడకలో స్థిరత్వం పెరగొచ్చు. శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోవడంలోనూ ఇది ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వయసు పెరిగినవారికి ఈ అలవాటు కొంత మేలు చేయొచ్చు.
ఒత్తిడి కాస్త తగ్గొచ్చు
పచ్చిక, ఇసుక లేదా మట్టిపై చెప్పులు లేకుండా నడవడం వల్ల ప్రకృతితో అనుబంధం పెరుగుతుంది. కాసేపు ఫోన్, పని, ఇతర ఆలోచనలకు దూరంగా నడవడం మనసుకు విశ్రాంతినిస్తుంది. దీంతో ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా అనిపించొచ్చు. కొందరిలో నిద్ర కూడా మెరుగుపడే అవకాశం ఉంది.
రక్త ప్రసరణకు మేలు
నడకతో పాదాలు, కాళ్లలో కదలిక పెరుగుతుంది. దీనివల్ల కాళ్లలో రక్త ప్రసరణ మెరుగుపడటానికి సహాయపడొచ్చు.
రోజుకు అరగంట చాలు
ఈ అలవాటును మొదలుపెట్టాలనుకునేవారు రోజూ 15 నుంచి 30 నిమిషాలు కేటాయించవచ్చు. గడ్డి, ఇసుక లేదా శుభ్రమైన మట్టిపై నడవడం మంచిది. అయితే ముళ్లు, రాళ్లు, గాజు ముక్కలతో జాగ్రత్తగా ఉండాలి. పాదాలకు ఏవైనా సమస్యలున్నవారు ముందుగా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.