మార్కెట్లో మళ్లీ అమ్మకాల జోరు.. 24,500 దిగువకు నిఫ్టీ
- 388 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 112 పాయింట్లు తగ్గిన నిఫ్టీ
- రియల్టీ, ఎఫ్ఎంసీజీ, సిమెంట్ షేర్లలో అమ్మకాలు
- రాణించిన నిఫ్టీ ఫార్మా సూచీ
- అమెరికా సీపీఐ గణాంకాలపై మదుపర్ల దృష్టి
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. రియల్టీ, ఎఫ్ఎంసీజీ, సిమెంట్ రంగాల షేర్లలో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. అమెరికా-ఇరాన్ చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న సంకేతాలు రావడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.
సెన్సెక్స్ 388.19 పాయింట్లు నష్టపోయి 78,154.25 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 112.10 పాయింట్లు తగ్గి 24,471.70 వద్ద ముగిసింది. నిఫ్టీలో టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, మ్యాక్స్ హెల్త్కేర్ ఇన్స్టిట్యూట్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.
రియల్టీ, ఎఫ్ఎంసీజీ, సిమెంట్, మెటల్ సూచీల్లో అమ్మకాలు కనిపించాయి. నిఫ్టీ సిమెంట్ సూచీ అత్యధికంగా నష్టపోయింది. ఫార్మా షేర్లు మాత్రం లాభాల్లో కొనసాగాయి. నిఫ్టీ మిడ్క్యాప్ 0.02 శాతం తగ్గగా, స్మాల్క్యాప్ సూచీ 0.22 శాతం లాభపడింది.
అంతర్జాతీయ పరిణామాలు మదుపర్లను ఆందోళనకు గురిచేశాయి. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు ముందుకు సాగడం లేదన్న సంకేతాలు రావడంతో ఇంధన మార్కెట్లు, ప్రపంచ మార్కెట్లపై ప్రభావం పడొచ్చన్న అంచనాలు పెరిగాయి.
నిఫ్టీకి 24,400 వద్ద తక్షణ మద్దతు ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ స్థాయి కిందకు జారితే 24,300 వరకు తగ్గే అవకాశం ఉందన్నారు. 24,500 వద్ద తక్షణ నిరోధం ఉండొచ్చని పేర్కొన్నారు. 24,600-24,700 స్థాయిని దాటితేనే మార్కెట్లో మళ్లీ బలమైన జోరు వచ్చే అవకాశం ఉందన్నారు.
ఇప్పుడు మదుపర్ల దృష్టి బుధవారం వెలువడనున్న అమెరికా వినియోగదారుల ధరల సూచీ గణాంకాలపై ఉంది. వడ్డీ రేట్లపై అంచనాలకు ఈ గణాంకాలు కీలకంగా మారనున్నాయి.
సెన్సెక్స్ 388.19 పాయింట్లు నష్టపోయి 78,154.25 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 112.10 పాయింట్లు తగ్గి 24,471.70 వద్ద ముగిసింది. నిఫ్టీలో టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, మ్యాక్స్ హెల్త్కేర్ ఇన్స్టిట్యూట్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.
రియల్టీ, ఎఫ్ఎంసీజీ, సిమెంట్, మెటల్ సూచీల్లో అమ్మకాలు కనిపించాయి. నిఫ్టీ సిమెంట్ సూచీ అత్యధికంగా నష్టపోయింది. ఫార్మా షేర్లు మాత్రం లాభాల్లో కొనసాగాయి. నిఫ్టీ మిడ్క్యాప్ 0.02 శాతం తగ్గగా, స్మాల్క్యాప్ సూచీ 0.22 శాతం లాభపడింది.
అంతర్జాతీయ పరిణామాలు మదుపర్లను ఆందోళనకు గురిచేశాయి. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు ముందుకు సాగడం లేదన్న సంకేతాలు రావడంతో ఇంధన మార్కెట్లు, ప్రపంచ మార్కెట్లపై ప్రభావం పడొచ్చన్న అంచనాలు పెరిగాయి.
నిఫ్టీకి 24,400 వద్ద తక్షణ మద్దతు ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ స్థాయి కిందకు జారితే 24,300 వరకు తగ్గే అవకాశం ఉందన్నారు. 24,500 వద్ద తక్షణ నిరోధం ఉండొచ్చని పేర్కొన్నారు. 24,600-24,700 స్థాయిని దాటితేనే మార్కెట్లో మళ్లీ బలమైన జోరు వచ్చే అవకాశం ఉందన్నారు.
ఇప్పుడు మదుపర్ల దృష్టి బుధవారం వెలువడనున్న అమెరికా వినియోగదారుల ధరల సూచీ గణాంకాలపై ఉంది. వడ్డీ రేట్లపై అంచనాలకు ఈ గణాంకాలు కీలకంగా మారనున్నాయి.