20 లక్షల మార్క్‌ దాటిన 'ఇంటింటికీ తెలుగు దేశం -2026'... నారా లోకేశ్ హర్షం

Nara Lokesh happy as Intintiki Telugu Desam 2026 crosses 20 lakh mark
  • ఏపీలో ఎనిమిదో రోజుకు చేరిన 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమం
  • సోమవారం ఒక్కరోజే 3 లక్షలకు పైగా కుటుంబాలను కలిసిన టీడీపీ శ్రేణులు
  • రెండేళ్ల పాలన విజయాలను ప్రజలకు వివరిస్తున్న నేతలు
  • క్షేత్రస్థాయిలో లభిస్తున్న ఆదరణపై నారా లోకేశ్ సంతృప్తి
  • కార్యకర్తలను, నాయకులకు అభినందనలు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "ఇంటింటికీ తెలుగుదేశం – 2026, 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి–సంక్షేమం" కార్యక్రమం కీలక మైలురాయిని చేరుకుంది. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 20 లక్షలకు పైగా కుటుంబాలను నేరుగా కలిసినట్లు టీడీపీ ప్రకటించింది.

ఎనిమిది రోజులుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షలకు పైగా ఇళ్లను టీడీపీ శ్రేణులు సందర్శించాయి. దీంతో ఈ కార్యక్రమం ద్వారా చేరిన మొత్తం ఇళ్ల సంఖ్య 20.61 లక్షలకు చేరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

సోమవారం రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, ప్రజాప్రతినిధులతో పాటు అన్ని స్థాయిల నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి, ప్రభుత్వ రెండేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.

ఈ కార్యక్రమం 20 లక్షల ఇళ్ల మార్క్‌ను దాటడంపై టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోందని, ఇది కార్యక్రమంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని ఆయన అన్నారు. ఈ మైలురాయిని అధిగమించడంలో కీలక పాత్ర పోషించిన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
Advertisement
Nara Lokesh
Telugu Desam Party
Intintiki Telugu Desam 2026
Andhra Pradesh Welfare Schemes
TDP Public Outreach Program
Andhra Pradesh Politics

More Telugu News