మునిగిపోతున్న తీరప్రాంత నగరాలు.. శాస్త్రవేత్తల అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
- తీర నగరాలకు సముద్ర మట్టం పెరుగుదలతో పాటు నేల కుంగిపోతుండడం వల్ల ముప్పు
- తీర ప్రాంతంలో ఏటా 6 మి.మీ. సముద్ర మట్టం పెరుగుదల ప్రభావం
- భూగర్భ జలాల అధిక వినియోగం ప్రధాన కారణమని అధ్యయనం
- జకార్తాలో ఏడాదికి 13.7 మి.మీ. మేర నేల కుంగుబాటు
- బంగ్లాదేశ్, చైనా, ఇండోనేషియా వంటి దేశాల్లో అధిక ముప్పు
- స్వీడన్, ఫిన్లాండ్లో మాత్రమే పైకి లేస్తున్న భూమి
సినిమాల్లో సముద్రం నగరాలను మింగేసే దృశ్యాలు చూస్తుంటాం. అవి కల్పిత కథలుగా అనిపించినా, ఇప్పుడు అదే దిశగా పరిస్థితులు మారుతున్నాయని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. వాతావరణ మార్పులతో సముద్ర మట్టం పెరగడం ఒక కారణమైతే, తీర ప్రాంతాల్లో నేల క్రమంగా కుంగిపోవడం మరో పెద్ద ముప్పుగా మారిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రెండు కారణాల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నట్లు వెల్లడైంది.
‘టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్’ (టీయూఎం), టులేన్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురితమైంది. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు సగటున ఏడాదికి 6 మిల్లీమీటర్ల మేర సముద్ర మట్టం పెరుగుదల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారని పరిశోధన తెలిపింది. ఇది ప్రపంచ సగటు కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ.
ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మందికి పైగా ప్రజలు తక్కువ ఎత్తులో ఉన్న తీర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అలాంటి ప్రాంతాల్లో సముద్ర మట్టం పెరగడమే కాదు, నేల కూడా క్రమంగా దిగజారడం పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తోందని శాస్త్రవేత్తలు వివరించారు.
తీర ప్రాంతాల్లో భూగర్భ జలాలను అధికంగా తోడేయడం, చమురు, సహజవాయువు వెలికితీత, నదీ డెల్టాల్లోని మృదువైన నేల కుంగిపోవడం, భారీ భవనాల బరువు వంటి కారణాలతో భూమి దిగజారుతోందని అధ్యయనం వెల్లడించింది. దీనికి తోడు భూకంప ఫలకాల్లో కదలికలు, మంచు యుగం తర్వాత భూపొరలో జరుగుతున్న సహజ మార్పులు కూడా ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది.
కొన్ని దేశాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. థాయ్లాండ్, బంగ్లాదేశ్, నైజీరియా, ఈజిప్ట్, చైనా, ఇండోనేషియా తీర ప్రాంతాల్లో ఏడాదికి 7 నుంచి 10 మిల్లీమీటర్ల మేర సముద్ర మట్టం పెరుగుదల నమోదవుతోంది. అమెరికా, నెదర్లాండ్స్, ఇటలీలో ఈ పెరుగుదల 4 నుంచి 5 మిల్లీమీటర్ల మధ్య ఉంది.
ఇండోనేషియా రాజధాని జకార్తా అత్యంత ప్రమాదంలో ఉన్న నగరంగా అధ్యయనం పేర్కొంది. అక్కడ సగటున ఏడాదికి 13.7 మిల్లీమీటర్ల మేర నేల కుంగిపోతోంది. కొన్ని ప్రాంతాల్లో ఈ వేగం 42 మిల్లీమీటర్ల వరకు నమోదైంది. చైనాలోని టియాంజిన్, థాయ్లాండ్లోని బ్యాంకాక్, నైజీరియాలోని లాగోస్, ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియా కూడా ప్రమాదకర జాబితాలో ఉన్నాయి.
అయితే అన్ని తీర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి లేదని పరిశోధకులు తెలిపారు. స్వీడన్, ఫిన్లాండ్లోని కొన్ని ప్రాంతాల్లో భూమి పైకి లేస్తుండటంతో అక్కడ సముద్ర మట్టం ప్రభావం తక్కువగా కనిపిస్తోందని వివరించారు.
భూగర్భ జలాల వినియోగాన్ని నియంత్రించడం ద్వారా నేల కుంగిపోవడాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు సూచించారు. ఒకప్పుడు ఏడాదికి 10 సెంటీమీటర్లకుపైగా కుంగిపోయిన టోక్యోలో ప్రభుత్వ చర్యలతో పరిస్థితి మెరుగుపడిందని గుర్తు చేశారు. ఇలాంటి చర్యలు ఇతర దేశాలు కూడా చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
‘టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్’ (టీయూఎం), టులేన్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురితమైంది. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు సగటున ఏడాదికి 6 మిల్లీమీటర్ల మేర సముద్ర మట్టం పెరుగుదల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారని పరిశోధన తెలిపింది. ఇది ప్రపంచ సగటు కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ.
ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మందికి పైగా ప్రజలు తక్కువ ఎత్తులో ఉన్న తీర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అలాంటి ప్రాంతాల్లో సముద్ర మట్టం పెరగడమే కాదు, నేల కూడా క్రమంగా దిగజారడం పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తోందని శాస్త్రవేత్తలు వివరించారు.
తీర ప్రాంతాల్లో భూగర్భ జలాలను అధికంగా తోడేయడం, చమురు, సహజవాయువు వెలికితీత, నదీ డెల్టాల్లోని మృదువైన నేల కుంగిపోవడం, భారీ భవనాల బరువు వంటి కారణాలతో భూమి దిగజారుతోందని అధ్యయనం వెల్లడించింది. దీనికి తోడు భూకంప ఫలకాల్లో కదలికలు, మంచు యుగం తర్వాత భూపొరలో జరుగుతున్న సహజ మార్పులు కూడా ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది.
కొన్ని దేశాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. థాయ్లాండ్, బంగ్లాదేశ్, నైజీరియా, ఈజిప్ట్, చైనా, ఇండోనేషియా తీర ప్రాంతాల్లో ఏడాదికి 7 నుంచి 10 మిల్లీమీటర్ల మేర సముద్ర మట్టం పెరుగుదల నమోదవుతోంది. అమెరికా, నెదర్లాండ్స్, ఇటలీలో ఈ పెరుగుదల 4 నుంచి 5 మిల్లీమీటర్ల మధ్య ఉంది.
ఇండోనేషియా రాజధాని జకార్తా అత్యంత ప్రమాదంలో ఉన్న నగరంగా అధ్యయనం పేర్కొంది. అక్కడ సగటున ఏడాదికి 13.7 మిల్లీమీటర్ల మేర నేల కుంగిపోతోంది. కొన్ని ప్రాంతాల్లో ఈ వేగం 42 మిల్లీమీటర్ల వరకు నమోదైంది. చైనాలోని టియాంజిన్, థాయ్లాండ్లోని బ్యాంకాక్, నైజీరియాలోని లాగోస్, ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియా కూడా ప్రమాదకర జాబితాలో ఉన్నాయి.
అయితే అన్ని తీర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి లేదని పరిశోధకులు తెలిపారు. స్వీడన్, ఫిన్లాండ్లోని కొన్ని ప్రాంతాల్లో భూమి పైకి లేస్తుండటంతో అక్కడ సముద్ర మట్టం ప్రభావం తక్కువగా కనిపిస్తోందని వివరించారు.
భూగర్భ జలాల వినియోగాన్ని నియంత్రించడం ద్వారా నేల కుంగిపోవడాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు సూచించారు. ఒకప్పుడు ఏడాదికి 10 సెంటీమీటర్లకుపైగా కుంగిపోయిన టోక్యోలో ప్రభుత్వ చర్యలతో పరిస్థితి మెరుగుపడిందని గుర్తు చేశారు. ఇలాంటి చర్యలు ఇతర దేశాలు కూడా చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.