బంకిపూర్ ఉప ఎన్నిక.. తిరుగులేని ఆధిక్యంలో ప్రశాంత్ కిశోర్
- బంకిపూర్ ఉపఎన్నికలో విజయానికి చేరువలో ప్రశాంత్ కిశోర్
- బీజేపీ కంచుకోటలో విరిసిన జన్ సురాజ్ జెండా
- బీజేపీ అభ్యర్థి రెండో స్థానానికి, ఆర్జేడీ మూడో స్థానానికి పరిమితం
ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (పీకే), బీహార్లోని బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఘన విజయం దిశగా దూసుకుపోతున్నారు. తాజా సమాచారం ప్రకారం, తన సమీప బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్పై ప్రశాంత్ కిశోర్ 19 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పాట్నాలోని ఏఎన్ కాలేజీలో మొత్తం 32 రౌండ్ల పాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. లెక్కింపు ప్రారంభం నుంచి ప్రశాంత్ కిశోర్ స్పష్టమైన ఆధిపత్యాన్ని కనబరిచారు. 28వ రౌండ్ ముగిసే సమయానికి ఆయనకు 59,247 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాకు 39,827 ఓట్లు లభించాయి. దీంతో పీకే సుమారు 19,420 ఓట్ల ఆధిక్యంతో తిరుగులేని స్థితికి చేరుకున్నారు. ఇక ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి 13,270 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.
గతంలో పాట్నా వెస్ట్ గా పిలవబడిన బంకిపూర్ నియోజకవర్గం, 1995 నుంచి బీజేపీకి కంచుకోటగా ఉంది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. సుమారు మూడు దశాబ్దాల తర్వాత బీజేపీ ఈ స్థానాన్ని కోల్పోతుండటం గమనార్హం. ఈ ఉప ఎన్నికల్లో కేవలం 34.3 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాట్నా పోలీసులు జోక్యం చేసుకుంటున్నారని ప్రశాంత్ కిశోర్ ఆరోపించినప్పటికీ, ఆయన భారీ మెజార్టీ దిశగా పయనించడం బీహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో నితిన్ నబిన్, ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారిపై 46 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
మరోవైపు, గుజరాత్లోని మంజల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సతేంద్రభాయ్ పటేల్ తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి భికాభాయ్ రాబరిపై 30 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్ తన సమీప బీజేపీ అభ్యర్థి కంటే 7 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పాట్నాలోని ఏఎన్ కాలేజీలో మొత్తం 32 రౌండ్ల పాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. లెక్కింపు ప్రారంభం నుంచి ప్రశాంత్ కిశోర్ స్పష్టమైన ఆధిపత్యాన్ని కనబరిచారు. 28వ రౌండ్ ముగిసే సమయానికి ఆయనకు 59,247 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాకు 39,827 ఓట్లు లభించాయి. దీంతో పీకే సుమారు 19,420 ఓట్ల ఆధిక్యంతో తిరుగులేని స్థితికి చేరుకున్నారు. ఇక ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి 13,270 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.
గతంలో పాట్నా వెస్ట్ గా పిలవబడిన బంకిపూర్ నియోజకవర్గం, 1995 నుంచి బీజేపీకి కంచుకోటగా ఉంది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. సుమారు మూడు దశాబ్దాల తర్వాత బీజేపీ ఈ స్థానాన్ని కోల్పోతుండటం గమనార్హం. ఈ ఉప ఎన్నికల్లో కేవలం 34.3 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాట్నా పోలీసులు జోక్యం చేసుకుంటున్నారని ప్రశాంత్ కిశోర్ ఆరోపించినప్పటికీ, ఆయన భారీ మెజార్టీ దిశగా పయనించడం బీహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో నితిన్ నబిన్, ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారిపై 46 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
మరోవైపు, గుజరాత్లోని మంజల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సతేంద్రభాయ్ పటేల్ తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి భికాభాయ్ రాబరిపై 30 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్ తన సమీప బీజేపీ అభ్యర్థి కంటే 7 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.