తిరుమల శ్రీవారికి సంజీవ్ గోయెంకా భారీ విరాళం
- రూ.7 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు స్వామివారికి విరాళం
- దాదాపు ఐదు కిలోల బంగారంతో చేయించిన కటి హస్తం, వరద హస్తాలు
- ఐపీఎల్ లో లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా
ఇక, ఐపీఎల్లో ఎల్ఎస్జీ ఫ్రాంచైజీ ఓనర్ అయిన గోయెంకా గతేడాది జరిగిన మెగా వేలంలో రిషభ్ పంత్ ను ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా రూ.27 కోట్లకు కొనుగోలు చేసి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. కానీ, ఈ సీజన్లో పంత్ అందుకుతగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడ్డాడు.
ఒకవైపు కెప్టెన్సీ, మరోవైపు టోర్నీలోనే కాస్ట్లీ ప్లేయర్ అనే ట్యాగ్తో మనోడు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదనే చెప్పాలి. ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన లక్నో జట్టు ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్లలో గెలిచినా జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు అంత సులువు కాదు.