Rajalingamurthy Murder Case: రాజ‌లింగ‌మూర్తి హ‌త్య కేసుపై వీడిన మిస్ట‌రీ

The Mystery of The Rajalingamurthy Murder Case Solved
షార్ట్స్‌లో చూడండి
ఇటీవ‌ల తెలంగాణ‌లో సంచ‌ల‌నం సృష్టించిన రాజ‌లింగ‌మూర్తి హ‌త్య కేసుపై సస్పెన్స్ వీడింది. ఆరు బృందాల‌తో ద‌ర్యాప్తు చేసిన భూపాల‌ప‌ల్లి పోలీసులు ఎట్ట‌కేల‌కు ఈ కేసు మిస్ట‌రీని ఛేదించారు. ఈ హ‌త్య కుట్ర‌లో పాత్ర‌ధారులు, సూత్ర‌ధారులైన ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప‌రారీలో ఉన్న మ‌రికొంత‌మంది నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

భూ వివాదాల‌ నేప‌థ్యంలోనే రేణుకుంట్ల సంజీవ త‌న బంధు, మిత్రుల‌తో క‌లిసి రాజ‌లింగ‌మూర్తిని ఈ నెల 19న హ‌త్య చేసిన‌ట్లుగా పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఏ-1గా రేణుకుంట్ల సంజీవ, ఏ-2గా పింగ‌లి సేమంత్ అలియాస్ బ‌బ్లూ, ఏ-3గా మోరే కుమార్‌, ఏ-4గా కొత్తూరి కిర‌ణ్‌, ఏ-5గా రేణికుంట్ల కొముర‌య్య‌, ఏ-6గా దాస‌ర‌పు కృష్ణ‌, ఏ-7గా రేణికుంట్ల సాంబ‌య్య‌ను పోలీసులు చేర్చారు. అటు రాజలింగమూర్తి హత్య రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే. 
Go Back to Shorts
Rajalingamurthy Murder Case
Telangana
Crime News

More Telugu News