పండవాని దిగ్గజం తీజన్ బాయి కన్నుమూత
- రాయ్పూర్లోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన తీజస్
- మహాభారత గాథలను గానరూపంలో వినిపించడంలో ఆమెది ప్రత్యేక శైలి
- పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాల గ్రహీత
- ఆమె మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
- భారతీయ సంస్కృతికి ఆమె చేసిన సేవలు అమూల్యమైనవని కొనియాడిన మోదీ
ఛత్తీస్గఢ్కు చెందిన తీజన్ బాయి, మహాభారత గాథలను తనదైన శైలిలో గాత్రం, అభినయంతో ఆవిష్కరించి అంతర్జాతీయ గుర్తింపు పొందారు. భారతీయ జానపద సంప్రదాయాలను పరిరక్షించడంలో ఆమె విశేష కృషి చేశారు. కళా రంగంలో ఆమె చేసిన అమూల్యమైన సేవలకు గాను భారత ప్రభుత్వం 1988లో పద్మశ్రీ, 2003లో పద్మభూషణ్, 2019లో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్తో ఆమెను గౌరవించింది.
తీజన్ బాయి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ సంస్కృతికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆమె మరణంతో జానపద సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసిందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా కళాకారులు, సాంస్కృతిక రంగ ప్రముఖులు ఆమెకు ఘన నివాళులు అర్పిస్తున్నారు.