కేసీఆర్ ఎంతమందికి బంగారం పంచారు?: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
- బంగారు తెలంగాణ సంగతి దేవుడెరుగు.. ఉన్న బంగారం అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్న రేవంత్
- పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందా? అని ప్రశ్న
- ప్రజల ఇబ్బందులు అర్థం చేసుకున్నందువల్లే కాంగ్రెస్ ఆరు హామీలు ఇచ్చిందన్న రేవంత్ రెడ్డి
ఇప్పుడు వచ్చి కేసీఆర్ మళ్ళీ ఓట్లు అడుగుతున్నారని, మందు పోయాలి, ఓటుకు రూ.10వేలు ఇవ్వాలనేది వారి ఆలోచన అన్నారు. రూ.1 లక్ష కోట్లు సంపాదించడమే బీఆర్ఎస్ నేతల లక్ష్యమన్నారు. కేసీఆర్ బంగారు తెలంగాణ అంటారని, కానీ బంగారు తెలంగాణ సంగతి దేవుడెరుగు... ఉన్న బంగారాన్ని అమ్ముకునే పరిస్థితి ఈ పాలనలో ఏర్పడిందన్నారు. మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వస్తే ప్రజల కష్టాలు అర్థం చేసుకొని, పరిష్కరిస్తుందన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొనే తాము ఆరు గ్యారెంటీలను ఇచ్చామన్నారు.