Advertisement

జింబాబ్వేతో తొలి టీ20: టాస్ గెలిచిన భారత్‌.. జట్టులోకి కొత్త ఫాస్ట్‌ బౌలర్‌

Shreyas Iyer wins toss and elects to bowl in first T20 against Zimbabwe
  • టీ20 అరంగేట్రం చేసిన అశోక్‌ శర్మ
  • జింబాబ్వేలో బెన్‌ కరన్‌, న్యామ్‌హురి టీ20 డెబ్యూ
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
  • పిచ్‌పై బౌన్స్‌ ఉంటుందని శ్రేయస్‌ అంచనా
  • తర్వాత బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుందన్న జింబాబ్వే కెప్టెన్‌
  • హరారేలో జరుగుతున్న తొలి టీ20
హరారే వేదికగా జింబాబ్వేతో గురువారం ప్రారంభమైన తొలి టీ20లో భారత జట్టు టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో యువ ఫాస్ట్‌ బౌలర్‌ అశోక్‌ శర్మ భారత జట్టు తరఫున అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేశాడు.

పిచ్‌పై బౌన్స్‌ ఉండే అవకాశం కనిపిస్తోందని, అందుకే ముందుగా బౌలింగ్‌ చేయాలని నిర్ణయించామని కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తెలిపాడు. జింబాబ్వే గత కొన్నేళ్లుగా మంచి క్రికెట్‌ ఆడుతోందని, తమ బలాలను సమర్థంగా ప్రదర్శిస్తోందని ప్రశంసించాడు.

మరోవైపు జింబాబ్వే కెప్టెన్‌ సికందర్‌ రజా మాట్లాడుతూ ఈ పిచ్‌ సాధారణ హరారే వికెట్‌లా లేదని, ఆరంభంలో బౌలర్లకు కొంత సహకరించినా తర్వాత బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుందని అభిప్రాయపడ్డాడు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో ఓడినా తమ జట్టులో ఎన్నో సానుకూల అంశాలు కనిపించాయని చెప్పాడు.

ఈ మ్యాచ్‌లో జింబాబ్వే తరఫున బెన్‌ కరన్‌, న్యూమన్‌ న్యామ్‌హురి కూడా టీ20 అరంగేట్రం చేశారు. బెన్ కరన్ ఎవరో కాదు... ఇంగ్లండ్ క్రికెటర్లు శామ్ కరన్, టామ్ కరన్ ల సోదరుడే. వీరి తండ్రి కెవిన్ కరన్ జింబాబ్వే మాజీ క్రికెటర్.

భారత్ జట్టు: వైభవ్‌ సూర్యవంశీ, అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌, శివమ్‌ దూబే, రవి బిష్ణోయ్‌, ప్రిన్స్‌ యాదవ్‌, అశోక్‌ శర్మ, మయాంక్‌ యాదవ్‌

జింబాబ్వే జట్టు: బ్రియాన్‌ బెన్నెట్‌, తడివానాశే మరుమాని, బెన్‌ కరన్‌, డియాన్‌ మైయర్స్‌, సికందర్‌ రజా (కెప్టెన్‌), ర్యాన్‌ బర్ల్‌, వెస్లీ మధెవెరే, బ్రాడ్‌ ఎవాన్స్‌, న్యూమన్‌ న్యామ్‌హురి, రిచర్డ్‌ ఎన్ గరవా, బ్లెస్సింగ్‌ ముజరబాని
Advertisement
Shreyas Iyer
India vs Zimbabwe T20
Ashok Sharma debut
Harare Sports Club
Sikandar Raza
Indian Cricket Team

More Telugu News