రజాకార్ల పాలనను భూస్థాపితం చేస్తేనే.. రామరాజ్యం వస్తుంది: బండి సంజయ్
- రంగురంగుల జెండాలను పక్కన పెట్టి కాషాయజెండాతో పచ్చజెండా రాజ్యాన్ని భూస్థాపితం చేద్దామన్న బండి సంజయ్
- కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మళ్లీ మధ్యంతర ఎన్నికలు ఖాయమన్న కరీంనగర్ ఎంపీ
- సుస్థిర పాలన కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని పిలుపు
ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మళ్లీ మధ్యంతర ఎన్నికలు ఖాయమన్నారు. గెలిచిన తర్వాత తాము అమ్ముడుపోమని కాంగ్రెస్ నేతలు గ్యారంటీ ఇస్తారా? అని ప్రశ్నించారు. సుస్థిర ప్రభుత్వం కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని పిలుపునిచ్చారు. అందుకు ప్రజలంతా ఏకం కావాలన్నారు. తాను ఆవేశంతో మాట్లాడటం లేదని, ఈ రాజకీయ పార్టీల తీరు చూసి తనకు బాధ వేస్తోందని, ఆవేదనతో మాట్లాడుతున్నానన్నారు.