Ambati Rambabu: లోకేశ్ తో చేరి దత్తపుత్రుడు చెడిపోతున్నాడు: మంత్రి అంబటి రాంబాబు

Ambati Rambabu comments on Lokesh and Pawan Kalyan
  • 'అల్లుడు సుద్దులు' అనే పుస్తకం రచించిన లక్ష్మీపార్వతి
  • విజయవాడలో పుస్తకావిష్కరణ కార్యక్రమం
  • హాజరైన మంత్రి అంబటి రాంబాబు
  • చంద్రబాబు సీఎం కావాలని పవన్ అడ్డమైన గడ్డీ కరుస్తున్నాడని విమర్శలు
ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి రచించిన 'అల్లుడు సుద్దులు' అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం నేడు విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అంబటి రాజకీయ వ్యాఖ్యలు చేశారు. 

చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని పవన్ కల్యాణ్ అడ్డమైన గడ్డీ కరుస్తున్నాడని విమర్శించారు. లోకేశ్ తో చేరి దత్తపుత్రుడు చెడిపోతున్నాడని అన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎలాగైతే అందరితో కలుస్తాడో, ఇప్పుడలాగే దత్తపుత్రుడు కూడా అందరితో కలుస్తున్నాడని వ్యంగ్యం ప్రదర్శించారు. పవన్ కల్యాణ్ తాను రోజుకు రూ.2 కోట్లు సంపాదిస్తానని చెబుతున్నాడని, మరి పన్నులు కడుతున్నాడో, లేదో అంటూ అంబటి సందేహం వ్యక్తం చేశారు. 

లోకేశ్... టీడీపీకి పట్టిన శని అని, ఆ లోకేశ్ కారణంగానే టీడీపీ గంగలో కలిసిపోతుందని అంబటి వ్యాఖ్యానించారు.
Ambati Rambabu
Nara Lokesh
Pawan Kalyan
Chandrababu
YSRCP
TDP
Janasena

More Telugu News