వలసదారులతో వెళ్తున్న పడవ మునక.. 79 మంది జల సమాధి
- పడవలో సామర్థ్యానికి మించి వసలదారులు
- బాధితులు పాకిస్థాన్, ఈజిప్ట్, సిరియాకు చెందిన వారిగా గుర్తింపు
- పడవలో ప్రయాణిస్తున్న వారి సంఖ్యపై లేని స్పష్టత
- వందలాదిమంది గల్లంతు
లిబియా నుంచి బయలుదేరిన పడవ మార్గమధ్యంలో మునిగిపోగా 104 మందిని రక్షించారు. వలసదారుల్లో చాలామంది ఈజిప్ట్, సిరియా, పాకిస్థాన్కు చెందినవారిగా తెలుస్తోంది. ప్రమాదం నుంచి రక్షించిన వారిని పైలోస్లోని గ్రీక్ ఓడరేవు కలమటకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడే వారికి తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇటలీలోని కలాబ్రియన్ తీరంలో ఓ పడవ తుపాను కారణంగా రాళ్లను ఢీకొట్టడంతో మునిగిపోయి 96 మంది ప్రాణాలు కోల్పోయారు.