పూంచ్ దాడి మా పనే: ప్రకటించిన జైషే మహ్మద్
- ఉగ్రదాడిలో అసువులు బాసిన ఐదుగురు జవాన్లు
- గ్రనేడ్ దాడి కారణంగానే వాహనంలో మంటలు
- ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో జల్లెడ పడుతున్న అధికారులు
సమాచారం అందుకున్న వెంటనే అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (జమ్ము) సహా సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. జిల్లాలోని రాజౌరి సెక్టార్లో నిన్న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ ఉగ్రదాడి జరిగింది. కాల్పులు జరిగిన వెంటనే వాహనంలో మంటలు చెలరేగాయి. గ్రనేడ్ దాడి కారణంగా మంటలు అంటుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు.