Prashant Kishor: బీహార్ యాత్రలో పీకే బిజీ.. వైసీపీ వ్యూహకర్తగా రుషిరాజ్?

  • బీహార్‌లో ‘జన్ సురాజ్’ యాత్రలో బిజీగా ప్రశాంత్ కిషోర్
  • పీకే సహచరుడైన రుషిరాజ్‌కు వైసీపీ వ్యూహకర్త బాధ్యతలు
  • నేటి వర్క్‌షాప్‌లో రుషిని పరిచయం చేయనున్న పీకే!
Rishi Raj Singh is the ysrcp political strategist

గత ఎన్నికల్లో వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం బీహార్‌లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన సహచరుడైన రుషిరాజ్ సింగ్‌కు వైసీపీ వ్యూహకర్త బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్.. ఆ పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా పీకేకు చెందిన ఐప్యాక్‌తోనే వైసీపీ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో 2024లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పీకే వైసీపీ వ్యూహకర్తగా పనిచేయాల్సి ఉంది. 

అయితే, ప్రస్తుతం ఆయన బీహార్‌లో ‘జన్ సురాజ్’ యాత్రలో బిజీగా ఉండడంతో ఆ బాధ్యతను ఐప్యాక్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడైన రుషి రాజ్ సింగ్‌కు అప్పగించినట్టు తెలుస్తోంది. నేడు జరగనున్న వర్క్ షాప్‌లో రుషి రాజ్‌ను వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా పరిచయం చేస్తారని సమాచారం.

More Telugu News