ముందే లబ్ధిదారుల ఎంపిక.. ఇందిరమ్మ ఎల్ఐజీ ఇళ్లలో సరికొత్త విప్లవం!
- నిర్మాణానికి ముందే లాటరీ ద్వారా కేటాయింపులు
- ఏడాదిలోనే పూర్తికి షీర్వాల్ టెక్నాలజీ
- లబ్ధిదారులకు ఉచితంగా యూడీఎస్ రిజిస్ట్రేషన్
- టవర్లలో మెరుగైన వసతులు, లిఫ్ట్లు
హైదరాబాద్లోని క్యూర్ పరిధిలో చేపట్టనున్న ఇందిరమ్మ ఎల్ఐజీ గృహనిర్మాణ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. నిర్మాణం పూర్తయ్యాక కాకుండా, ముందే లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయింపులు జరిపిన తర్వాతే పనులు ప్రారంభించనుంది. దరఖాస్తులు ఎక్కువగా వస్తే అందరి సమక్షంలో పారదర్శకంగా లాటరీ తీస్తారు. ఎంపికైన వారు తమ వాటా రూ. 6 లక్షల్లో, కేటాయింపు సమయంలో రూ. లక్ష చెల్లించి, మిగతా రూ. 5 లక్షలను నిర్మాణం పూర్తయ్యేలోపు నాలుగు విడతల్లో చెల్లించే సదుపాయం కల్పించారు. దీనివల్ల నివాస అవసరాల స్పష్టత రావడంతో పాటు బ్యాంకు రుణాలు పొందడం తేలికవుతుంది.
పైలట్ ప్రాజెక్ట్ కింద 16 ప్రదేశాల్లో, ఒక్కోచోట 4 బ్లాక్లతో 480 ఫ్లాట్లను డిజైన్ చేశారు. ఆధునిక షీర్వాల్ టెక్నాలజీ ద్వారా ఇటుకలు వాడకుండా, కాంక్రీట్తోనే గోడలను నిర్మిస్తూ 12 నెలల్లోనే నాణ్యమైన నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో ఫ్లాట్ను 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. అత్యంత ప్రాధాన్య అంశంగా, లబ్ధిదారులైన మహిళల పేరిట 17 నుంచి 22 గజాల వరకు స్థలాన్ని (యూడీఎస్) ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వనుంది. మార్కెట్ ధరల ప్రకారం లబ్ధిదారులకు సుమారు రూ. 20 నుంచి 40 లక్షల విలువైన ఆస్తి లభిస్తుంది. నాణ్యతలో రాజీ పడకుండా సకాలంలో ఇళ్లను అందించేందుకు టెండర్ నిబంధనలను సిద్ధం చేస్తున్నారు.
పైలట్ ప్రాజెక్ట్ కింద 16 ప్రదేశాల్లో, ఒక్కోచోట 4 బ్లాక్లతో 480 ఫ్లాట్లను డిజైన్ చేశారు. ఆధునిక షీర్వాల్ టెక్నాలజీ ద్వారా ఇటుకలు వాడకుండా, కాంక్రీట్తోనే గోడలను నిర్మిస్తూ 12 నెలల్లోనే నాణ్యమైన నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో ఫ్లాట్ను 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. అత్యంత ప్రాధాన్య అంశంగా, లబ్ధిదారులైన మహిళల పేరిట 17 నుంచి 22 గజాల వరకు స్థలాన్ని (యూడీఎస్) ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వనుంది. మార్కెట్ ధరల ప్రకారం లబ్ధిదారులకు సుమారు రూ. 20 నుంచి 40 లక్షల విలువైన ఆస్తి లభిస్తుంది. నాణ్యతలో రాజీ పడకుండా సకాలంలో ఇళ్లను అందించేందుకు టెండర్ నిబంధనలను సిద్ధం చేస్తున్నారు.