Pawan Kalyan: అధికార దుర్వినియోగంపై పవన్ కల్యాణ్ ట్వీట్
ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఆలోచనలను, అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన అధికార దుర్వినియోగానికి సంబంధించి ఆసక్తికర ట్వీట్ చేశారు. 'ఏ ఒక్క ప్రభుత్వమూ ఎక్కువ కాలం పాటు అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు. నిరంకుశత్వాన్ని వ్యతిరేకించే సహజ లక్షణం ప్రజల స్వభావంలోనే ఉంటుంది. ఏ ప్రభుత్వం నుంచైనా అదే మనకు రక్షణగా నిలుస్తుంది' అంటూ శామ్యూల్ జాన్సన్ అన్న మాటలను ట్విట్టర్ లో షేర్ చేశారు.