సీఎం చంద్రబాబు జిల్లాల బాట.. నేటి నుంచి ఐదు రోజుల పర్యటన

Chandrababu Naidu district tour five day visit from today
  • నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో పర్యటించనున్న సీఎం
  • ఇవాళ నెల్లూరులో పెన్షన్ల పంపిణీ, తిరుపతిలో హీరో మోటార్స్‌కు శంకుస్థాపన
  • రూ.750 కోట్ల పెట్టుబడితో హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ ఏర్పాటు
  • రేపు మంగంపేట, తిరుపతిలో పలు కార్యక్రమాలకు హాజరుకానున్న ముఖ్యమంత్రి
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇవాల్టి నుంచి ఐదు రోజుల పాటు ఆయన నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని పున్నపువారిపాలెంలో నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన తిరుపతి జిల్లా సత్యవేడుకు బయలుదేరి వెళ్లారు. అక్కడ ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హీరో మోటార్స్‌కు చెందిన గ్లోబల్ పార్ట్స్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కేంద్రాన్ని హీరో మోటార్స్ సంస్థ సుమారు రూ.750 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేస్తోంది.

ఈ కార్యక్రమం ముగిశాక ముఖ్యమంత్రి ఇవాళ రాత్రికి శ్రీసిటీలోనే బస చేయనున్నారు. రేపటి పర్యటనలో భాగంగా మంగంపేటలో 'వీబీ జీ రామ్‌జీ' ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం తిరుపతిలో జరగనున్న జీఎస్‌డీపీ సదస్సుకు చంద్రబాబు హాజరవుతారు.
Chandrababu Naidu
AP CM District Tour
NTR Bharosa Pension
Hero Motors Satyavedu
Andhra Pradesh Development Programs
Tirupati GSDP Conference

More Telugu News