చైనాకు గట్టి ప్రత్యామ్నాయంగా భారత్.. స్మార్ట్ఫోన్ తయారీలో దూకుడు
- స్మార్ట్ఫోన్ తయారీలో 18 శాతానికి చేరిన భారత వాటా
- 90 శాతానికి పైగా చైనా, భారత్, వియత్నాం వాటా
- 20 రెట్లకు పైగా పెరిగిన భారత్లో మొబైల్ ఉత్పత్తి
- 100 రెట్లకు పైగా పెరిగిన మొబైల్ ఎగుమతులు
- ఐఫోన్లలో నాలుగో వంతు భారత్లో అసెంబుల్
ప్రపంచ స్మార్ట్ఫోన్ తయారీ రంగంలో భారత్ తన స్థానాన్ని వేగంగా బలోపేతం చేసుకుంటోంది. చైనాలో ఉత్పత్తిపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు కంపెనీలు అనుసరిస్తున్న ‘చైనా ప్లస్ వన్’ వ్యూహం భారత్కు కలిసొస్తోంది. తాజా నివేదిక ప్రకారం.. 2025 నాటికి ప్రపంచ స్మార్ట్ఫోన్ ఉత్పత్తిలో భారత్ వాటా సుమారు 18 శాతానికి చేరింది.
ప్రస్తుతం చైనా 63 శాతం వాటాతో ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ఫోన్ తయారీదారుగా కొనసాగుతోంది. భారత్, వియత్నాం తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడు దేశాలు కలిసి ప్రపంచ స్మార్ట్ఫోన్ ఉత్పత్తిలో 90 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నాయని నివేదిక పేర్కొంది.
భారత్లో మొబైల్ ఫోన్ల తయారీ పెరగడానికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు కీలకంగా మారాయి. ముఖ్యంగా ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం’ (పీఎల్ఐ) తయారీదారులను ఉత్పత్తి పెంచేలా ప్రోత్సహిస్తోంది. స్థానికంగా తయారీ పెంచే కంపెనీలకు ప్రోత్సాహకాలు అందుతున్నాయి. దీంతో పదేళ్లలోపే దేశీయ మొబైల్ ఫోన్ ఉత్పత్తి 20 రెట్లకు పైగా పెరిగింది. ఎగుమతులు 100 రెట్లకు పైగా వృద్ధి చెందాయి.
ప్రస్తుతం యాపిల్ తయారు చేసే ఐఫోన్లలో దాదాపు నాలుగో వంతు భారత్లోనే అసెంబుల్ అవుతున్నాయి. అమెరికాకు స్మార్ట్ఫోన్లను ఎగుమతి చేసే అతిపెద్ద వనరుగా కూడా భారత్ ఎదిగింది. గూగుల్ కూడా తన పిక్సెల్ ఫోన్ల తయారీని భారత్ వైపు మళ్లిస్తోంది. 2027 నాటికి కొన్ని పరికరాల తయారీని చైనాలో నిలిపివేయాలని సంస్థ భావిస్తున్నట్లు నివేదిక తెలిపింది.
అయితే చైనాను పూర్తిగా పక్కన పెట్టే పరిస్థితి లేదని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ఫోన్లతో పాటు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, డిస్ప్లే ప్యానెళ్ల తయారీలో చైనాకు ఇప్పటికీ భారీ ఆధిపత్యం ఉంది. అందుకే కంపెనీలు చైనాను పూర్తిగా భర్తీ చేయడం కాకుండా.. ప్రత్యామ్నాయ తయారీ కేంద్రాలను అభివృద్ధి చేసుకుంటున్నాయి.
ప్రస్తుతం దిగుమతి చేసుకున్న విడిభాగాలతో ఫోన్లను అసెంబుల్ చేయడం దాటి.. సర్క్యూట్ బోర్డులు, కెమెరా మాడ్యూళ్లు, బ్యాటరీలు, డిస్ప్లేలు, సెమీకండక్టర్ల తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. మొబైల్ ఫోన్లలో దేశీయ విలువ జోడింపు సుమారు 23 శాతానికి చేరింది.
సెమీకండక్టర్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం ‘సెమికాన్ ఇండియా’ కార్యక్రమం ద్వారా సుమారు 10 బిలియన్ డాలర్లు కేటాయించింది. చిప్ డిజైన్, తయారీ పరికరాలు, ప్రత్యేక పదార్థాలు, నైపుణ్యం కలిగిన ఇంజినీర్లపై కూడా పెట్టుబడులు పెడుతోంది. 2035 నాటికి 120 నుంచి 150 బిలియన్ డాలర్ల విలువైన సెమీకండక్టర్ వాల్యూ చైన్ నిర్మించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం చైనా 63 శాతం వాటాతో ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ఫోన్ తయారీదారుగా కొనసాగుతోంది. భారత్, వియత్నాం తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడు దేశాలు కలిసి ప్రపంచ స్మార్ట్ఫోన్ ఉత్పత్తిలో 90 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నాయని నివేదిక పేర్కొంది.
భారత్లో మొబైల్ ఫోన్ల తయారీ పెరగడానికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు కీలకంగా మారాయి. ముఖ్యంగా ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం’ (పీఎల్ఐ) తయారీదారులను ఉత్పత్తి పెంచేలా ప్రోత్సహిస్తోంది. స్థానికంగా తయారీ పెంచే కంపెనీలకు ప్రోత్సాహకాలు అందుతున్నాయి. దీంతో పదేళ్లలోపే దేశీయ మొబైల్ ఫోన్ ఉత్పత్తి 20 రెట్లకు పైగా పెరిగింది. ఎగుమతులు 100 రెట్లకు పైగా వృద్ధి చెందాయి.
ప్రస్తుతం యాపిల్ తయారు చేసే ఐఫోన్లలో దాదాపు నాలుగో వంతు భారత్లోనే అసెంబుల్ అవుతున్నాయి. అమెరికాకు స్మార్ట్ఫోన్లను ఎగుమతి చేసే అతిపెద్ద వనరుగా కూడా భారత్ ఎదిగింది. గూగుల్ కూడా తన పిక్సెల్ ఫోన్ల తయారీని భారత్ వైపు మళ్లిస్తోంది. 2027 నాటికి కొన్ని పరికరాల తయారీని చైనాలో నిలిపివేయాలని సంస్థ భావిస్తున్నట్లు నివేదిక తెలిపింది.
అయితే చైనాను పూర్తిగా పక్కన పెట్టే పరిస్థితి లేదని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ఫోన్లతో పాటు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, డిస్ప్లే ప్యానెళ్ల తయారీలో చైనాకు ఇప్పటికీ భారీ ఆధిపత్యం ఉంది. అందుకే కంపెనీలు చైనాను పూర్తిగా భర్తీ చేయడం కాకుండా.. ప్రత్యామ్నాయ తయారీ కేంద్రాలను అభివృద్ధి చేసుకుంటున్నాయి.
ప్రస్తుతం దిగుమతి చేసుకున్న విడిభాగాలతో ఫోన్లను అసెంబుల్ చేయడం దాటి.. సర్క్యూట్ బోర్డులు, కెమెరా మాడ్యూళ్లు, బ్యాటరీలు, డిస్ప్లేలు, సెమీకండక్టర్ల తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. మొబైల్ ఫోన్లలో దేశీయ విలువ జోడింపు సుమారు 23 శాతానికి చేరింది.
సెమీకండక్టర్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం ‘సెమికాన్ ఇండియా’ కార్యక్రమం ద్వారా సుమారు 10 బిలియన్ డాలర్లు కేటాయించింది. చిప్ డిజైన్, తయారీ పరికరాలు, ప్రత్యేక పదార్థాలు, నైపుణ్యం కలిగిన ఇంజినీర్లపై కూడా పెట్టుబడులు పెడుతోంది. 2035 నాటికి 120 నుంచి 150 బిలియన్ డాలర్ల విలువైన సెమీకండక్టర్ వాల్యూ చైన్ నిర్మించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.