మజ్లిస్ నుంచి బహిష్కరణ.. ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ మిస్సింగ్ కలకలం!
- ఎంఐఎం నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ అదృశ్యం
- మైనర్పై లైంగిక దాడి ఆరోపణలతో తీవ్ర వివాదంలో బేగ్
- ఆరోపణలు అవాస్తవం, డీప్ఫేక్లతో కుట్ర చేస్తున్నారని ఆయన వెల్లడి
- ఘటనపై సమగ్ర విచారణ జరపాలని బీజేపీ, బీఆర్ఎస్ డిమాండ్
ఎంఐఎం నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ అదృశ్యం కావడం హైదరాబాద్ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఉమ్రా యాత్ర ముగించుకుని శనివారం నగరానికి చేరుకున్న ఆయన, అప్పటి నుంచి కనిపించకుండా పోయినట్లు సమాచారం. ఇప్పటికే పలు తీవ్రమైన ఆరోపణలతో వివాదాల్లో చిక్కుకున్న ఆయన అదృశ్యం కావడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది.
క్రమశిక్షణా చర్యల భాగంగా రహ్మత్ బేగ్ను పార్టీ నుంచి తక్షణమే బహిష్కరిస్తున్నట్లు ఇటీవల ఎంఐఎం ప్రకటించింది. అంతేకాకుండా, ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేయాలని పార్టీ అధిష్ఠానం ఆయనను ఆదేశించింది. అయితే, రాజీనామా చేసేందుకు నిరాకరించిన ఆయన, తాను ఎంఐఎం కార్యకర్తగానే కొనసాగుతానని అప్పట్లో స్పష్టం చేశారు.
రహ్మత్ బేగ్ ఒక మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, ఈ ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. తనను అప్రతిష్ఠపాలు చేసేందుకు కొందరు కావాలనే మార్ఫింగ్, డీప్ఫేక్ వీడియోలు, ఫోటోలను సృష్టించి ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గుర్తుతెలియని వ్యక్తులు డబ్బుల కోసం తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని, దీనిపై ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తనకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ వివాదంపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు స్పందిస్తూ, ఆరోపణలపై పారదర్శకంగా, సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేశాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై నిష్పక్షపాత విచారణకు ఆదేశించి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ కోరారు. ఈ వరుస వివాదాల నేపథ్యంలో రహ్మత్ బేగ్ అదృశ్యం కావడం ఈ వ్యవహారాన్ని మరింత సంక్లిష్టంగా మార్చింది.
క్రమశిక్షణా చర్యల భాగంగా రహ్మత్ బేగ్ను పార్టీ నుంచి తక్షణమే బహిష్కరిస్తున్నట్లు ఇటీవల ఎంఐఎం ప్రకటించింది. అంతేకాకుండా, ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేయాలని పార్టీ అధిష్ఠానం ఆయనను ఆదేశించింది. అయితే, రాజీనామా చేసేందుకు నిరాకరించిన ఆయన, తాను ఎంఐఎం కార్యకర్తగానే కొనసాగుతానని అప్పట్లో స్పష్టం చేశారు.
రహ్మత్ బేగ్ ఒక మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, ఈ ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. తనను అప్రతిష్ఠపాలు చేసేందుకు కొందరు కావాలనే మార్ఫింగ్, డీప్ఫేక్ వీడియోలు, ఫోటోలను సృష్టించి ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గుర్తుతెలియని వ్యక్తులు డబ్బుల కోసం తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని, దీనిపై ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తనకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ వివాదంపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు స్పందిస్తూ, ఆరోపణలపై పారదర్శకంగా, సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేశాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై నిష్పక్షపాత విచారణకు ఆదేశించి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ కోరారు. ఈ వరుస వివాదాల నేపథ్యంలో రహ్మత్ బేగ్ అదృశ్యం కావడం ఈ వ్యవహారాన్ని మరింత సంక్లిష్టంగా మార్చింది.