స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా
- తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,60,490
- 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,47,110గా నమోదు
- కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.2,65,100కి చేరిక
బంగారం ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావం పసిడి ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. శనివారం ఉదయం నాటికి దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పుంజుకోగా, వెండి కూడా అదే బాటలో పయనించింది. కిలో వెండి ధర సుమారు రూ.100 మేర పెరిగింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,60,490గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,110గా నమోదైంది. ఇదే సమయంలో 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,20,370 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.2,65,100కి చేరింది.
దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ పసిడి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు చోటుచేసుకున్నాయి. చెన్నై, ముంబై, కోల్కతా, కేరళ రాష్ట్రాల్లో ధరలు దాదాపు హైదరాబాద్ తరహాలోనే ఉన్నాయి. అయితే ఢిల్లీలో మాత్రం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,60,640గా, 22 క్యారెట్ల ధర రూ.1,47,260గా కొంచెం అధికంగా నమోదైంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,60,490గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,110గా నమోదైంది. ఇదే సమయంలో 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,20,370 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.2,65,100కి చేరింది.
దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ పసిడి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు చోటుచేసుకున్నాయి. చెన్నై, ముంబై, కోల్కతా, కేరళ రాష్ట్రాల్లో ధరలు దాదాపు హైదరాబాద్ తరహాలోనే ఉన్నాయి. అయితే ఢిల్లీలో మాత్రం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,60,640గా, 22 క్యారెట్ల ధర రూ.1,47,260గా కొంచెం అధికంగా నమోదైంది.