నాకు స్వాగతం పలుకుతున్నారేమో అనుకున్నా!: మండలిలో తొలి రోజు అనుభవంపై వర్ల రామయ్య ఆవేదన
- గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య
- తొలి రోజు అనుభవం ఒక పీడకల అంటూ వ్యాఖ్యలు
- పెద్దల సభలో వైసీపీ సభ్యులు గద్దల్లా వ్యవహరించారని విమర్శలు
- దళిత ఛైర్మన్ను అవమానిస్తూ సభా గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం
- మెగా డీఎస్సీపై తప్పుడు ఆరోపణలతో నిరుద్యోగులను భయపెడుతున్నారని వెల్లడి
- జగన్ ప్రోత్సాహంతోనే సభలో వైసీపీ సభ్యులు రచ్చ చేస్తున్నారని ఆరోపణ
శాసనమండలిలో తన తొలిరోజు అనుభవం ఓ పీడకలలా మిగిలిపోయిందని, పెద్దల సభలో వైసీపీ సభ్యులు "పెద్దల్లా" కాకుండా "గద్దల్లా" వ్యవహరించి సభా గౌరవాన్ని మంటగలిపారని నూతన ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించి, చట్టాలను సమీక్షించాల్సిన మండలిలో నినాదాలు, గందరగోళంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. శుక్రవారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కౌన్సిల్లో వైసీపీ సభ్యుల తీరు తనను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసిందన్నారు.
ముందుగా, తనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆమోదం తెలిపిన గవర్నర్కు వర్ల రామయ్య కృతజ్ఞతలు తెలిపారు. తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజు సభ వాయిదా పడగా, ఎమ్మెల్సీగా కార్యకలాపాల్లో పాల్గొనేందుకు నిన్న తొలిసారి సభలో అడుగుపెట్టానని చెప్పారు.
"సభలోకి అడుగుపెట్టగానే పెద్ద ఎత్తున గందరగోళం కనిపించింది. కొత్త సభ్యుడిగా నాకు స్వాగతం పలుకుతున్నారేమో అని తొలుత భావించాను. కానీ, కాసేపటికే వైసీపీ సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని అర్థమైంది. ఛైర్మన్ మోషేన్ రాజు ఆసీనులై ఉండగా, ఆయనకు ఇరువైపులా నిలబడి, ముఖానికి అడ్డంగా ప్లకార్డులు పెట్టి, మైక్రోఫోన్ లాక్కొని పెద్దగా నినాదాలు చేశారు. వారి ప్రవర్తన చూసి తీవ్రంగా కలత చెందాను" అని తన తొలిరోజు అనుభవాన్ని వివరించారు.
దళిత ఛైర్మన్ను అవమానిస్తున్నారు
దళిత వర్గానికి చెందిన ఛైర్మన్ మోషెన్ రాజును వైసీపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్నారని రామయ్య ఆరోపించారు. "ఒక దళిత నాయకుడు ఆ స్థానంలో కూర్చొని సభను నడపడం వారికి ఇష్టం లేదా? ఆయన వయసును, హోదాను కూడా గౌరవించడం లేదు. ఇది పెద్దల సభ ఔన్నత్యాన్ని దెబ్బతీయడమే. పెద్దరికం వయసుతో రాదు, ప్రవర్తనతో వస్తుంది. 25 ఏళ్ల యువకుడు కూడా తన నడవడికతో పెద్దమనిషి అనిపించుకోవచ్చు. కానీ, మండలిలో వైసీపీ సభ్యుల తీరు అల్లరి మూకలను తలపిస్తోంది" అని మండిపడ్డారు.
జగన్ ప్రోత్సాహంతోనే ఈ రచ్చ
ఈ గందరగోళం వెనుక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రోత్సాహం ఉందని వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు. "సభలో ఎవరు ఎంత గట్టిగా అరిచారు, ఎవరు ఛైర్మన్ను ఎంతలా అడ్డుకున్నారు అని సెల్ఫీలు, వీడియోలు తీసుకుని జగన్కు పంపుతున్నారు. దానికి ఆయన 'వెరీ గుడ్, యూ ఆర్ పాస్డ్' అని ప్రోత్సహిస్తున్నారు. సభను అడ్డుకోవడానికే జగన్ వారిని పంపించారా? ఇది ప్రజాస్వామ్యమా?" అని ప్రశ్నించారు.
మంత్రి నారా లోకేశ్ పై ఈర్ష్య, ద్వేషంతోనే వైసీపీ నేతలు సభలో అసభ్యకర సైగలు చేస్తూ, అనుచితంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 169, 171 ప్రకారం మండలి ఒక సమీక్షా సభ అని, చట్టసభ చేసిన బిల్లులను లోతుగా పరిశీలించి సూచనలు చేయాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు. అలాంటి సభను వ్యక్తిగత కక్ష సాధింపులకు వేదికగా మార్చడం దుర్మార్గమన్నారు.
లోకేశ్ సవాల్ కు బదులేదీ?
మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను వర్ల రామయ్య తీవ్రంగా ఖండించారు. "మంత్రి నారా లోకేశ్ బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరితే వైసీపీ నేతలు పారిపోయారు. డీఎస్సీలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్నవారు ఆధారాలు చూపాలి. ఇప్పటికే సంబంధిత శాఖల ఉన్నతాధికారులు అజయ్ జైన్, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మీడియా సమావేశాలు పెట్టి ప్రతీ అంశాన్ని స్పష్టంగా వివరించారు. అయినా అనుమానాలుంటే కార్యాలయానికి వచ్చి నివృత్తి చేసుకోవచ్చని కూడా చెప్పారు. కానీ, వైసీపీ నేతలు వాస్తవాలు తెలుసుకోకుండా నిరుద్యోగులను, ఇప్పటికే ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెగా డీఎస్సీపై హైకోర్టులో 341 పిటిషన్లు దాఖలు కాగా, వాటన్నింటినీ న్యాయస్థానం కొట్టివేసిందని గుర్తుచేశారు. "ఆధారాలుంటే కోర్టుకు వెళ్లాలి, అంతేగానీ ఏడాది క్రితం ఉద్యోగాలు సాధించిన వారిని మానసికంగా వేధించడం సరికాదు. మీ రాజకీయాల కోసం వారి జీవితాలతో ఆడుకోవద్దు" అని హితవు పలికారు.
కౌరవులు వందమంది.. ఏం ఉపయోగం!
మహాభారతంలో పాండవులు ఐదుగురే ఉన్నా ధర్మం వైపు నిలబడి గెలిచారని, వందమంది కౌరవులు అధర్మం వైపు ఉండి ఓడిపోయారని రామయ్య ఉదహరించారు. "సభలో మా సంఖ్య తక్కువగా ఉండొచ్చు, కానీ మేము ప్రజల పక్షాన, ధర్మం వైపు ఉన్నాం. వైసీపీ తన తీరు మార్చుకోకపోతే కౌరవుల గతే పడుతుంది. ఇప్పటికైనా జగన్ తన ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసి, సభా గౌరవాన్ని కాపాడేలా చూడాలి. రాబోయే సమావేశాల్లోనైనా వారు పెద్దల సభ సభ్యుల్లా హుందాగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నాను" అని వర్ల రామయ్య పేర్కొన్నారు.
ముందుగా, తనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆమోదం తెలిపిన గవర్నర్కు వర్ల రామయ్య కృతజ్ఞతలు తెలిపారు. తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజు సభ వాయిదా పడగా, ఎమ్మెల్సీగా కార్యకలాపాల్లో పాల్గొనేందుకు నిన్న తొలిసారి సభలో అడుగుపెట్టానని చెప్పారు.
"సభలోకి అడుగుపెట్టగానే పెద్ద ఎత్తున గందరగోళం కనిపించింది. కొత్త సభ్యుడిగా నాకు స్వాగతం పలుకుతున్నారేమో అని తొలుత భావించాను. కానీ, కాసేపటికే వైసీపీ సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని అర్థమైంది. ఛైర్మన్ మోషేన్ రాజు ఆసీనులై ఉండగా, ఆయనకు ఇరువైపులా నిలబడి, ముఖానికి అడ్డంగా ప్లకార్డులు పెట్టి, మైక్రోఫోన్ లాక్కొని పెద్దగా నినాదాలు చేశారు. వారి ప్రవర్తన చూసి తీవ్రంగా కలత చెందాను" అని తన తొలిరోజు అనుభవాన్ని వివరించారు.
దళిత ఛైర్మన్ను అవమానిస్తున్నారు
దళిత వర్గానికి చెందిన ఛైర్మన్ మోషెన్ రాజును వైసీపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్నారని రామయ్య ఆరోపించారు. "ఒక దళిత నాయకుడు ఆ స్థానంలో కూర్చొని సభను నడపడం వారికి ఇష్టం లేదా? ఆయన వయసును, హోదాను కూడా గౌరవించడం లేదు. ఇది పెద్దల సభ ఔన్నత్యాన్ని దెబ్బతీయడమే. పెద్దరికం వయసుతో రాదు, ప్రవర్తనతో వస్తుంది. 25 ఏళ్ల యువకుడు కూడా తన నడవడికతో పెద్దమనిషి అనిపించుకోవచ్చు. కానీ, మండలిలో వైసీపీ సభ్యుల తీరు అల్లరి మూకలను తలపిస్తోంది" అని మండిపడ్డారు.
జగన్ ప్రోత్సాహంతోనే ఈ రచ్చ
ఈ గందరగోళం వెనుక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రోత్సాహం ఉందని వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు. "సభలో ఎవరు ఎంత గట్టిగా అరిచారు, ఎవరు ఛైర్మన్ను ఎంతలా అడ్డుకున్నారు అని సెల్ఫీలు, వీడియోలు తీసుకుని జగన్కు పంపుతున్నారు. దానికి ఆయన 'వెరీ గుడ్, యూ ఆర్ పాస్డ్' అని ప్రోత్సహిస్తున్నారు. సభను అడ్డుకోవడానికే జగన్ వారిని పంపించారా? ఇది ప్రజాస్వామ్యమా?" అని ప్రశ్నించారు.
మంత్రి నారా లోకేశ్ పై ఈర్ష్య, ద్వేషంతోనే వైసీపీ నేతలు సభలో అసభ్యకర సైగలు చేస్తూ, అనుచితంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 169, 171 ప్రకారం మండలి ఒక సమీక్షా సభ అని, చట్టసభ చేసిన బిల్లులను లోతుగా పరిశీలించి సూచనలు చేయాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు. అలాంటి సభను వ్యక్తిగత కక్ష సాధింపులకు వేదికగా మార్చడం దుర్మార్గమన్నారు.
లోకేశ్ సవాల్ కు బదులేదీ?
మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను వర్ల రామయ్య తీవ్రంగా ఖండించారు. "మంత్రి నారా లోకేశ్ బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరితే వైసీపీ నేతలు పారిపోయారు. డీఎస్సీలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్నవారు ఆధారాలు చూపాలి. ఇప్పటికే సంబంధిత శాఖల ఉన్నతాధికారులు అజయ్ జైన్, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మీడియా సమావేశాలు పెట్టి ప్రతీ అంశాన్ని స్పష్టంగా వివరించారు. అయినా అనుమానాలుంటే కార్యాలయానికి వచ్చి నివృత్తి చేసుకోవచ్చని కూడా చెప్పారు. కానీ, వైసీపీ నేతలు వాస్తవాలు తెలుసుకోకుండా నిరుద్యోగులను, ఇప్పటికే ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెగా డీఎస్సీపై హైకోర్టులో 341 పిటిషన్లు దాఖలు కాగా, వాటన్నింటినీ న్యాయస్థానం కొట్టివేసిందని గుర్తుచేశారు. "ఆధారాలుంటే కోర్టుకు వెళ్లాలి, అంతేగానీ ఏడాది క్రితం ఉద్యోగాలు సాధించిన వారిని మానసికంగా వేధించడం సరికాదు. మీ రాజకీయాల కోసం వారి జీవితాలతో ఆడుకోవద్దు" అని హితవు పలికారు.
కౌరవులు వందమంది.. ఏం ఉపయోగం!
మహాభారతంలో పాండవులు ఐదుగురే ఉన్నా ధర్మం వైపు నిలబడి గెలిచారని, వందమంది కౌరవులు అధర్మం వైపు ఉండి ఓడిపోయారని రామయ్య ఉదహరించారు. "సభలో మా సంఖ్య తక్కువగా ఉండొచ్చు, కానీ మేము ప్రజల పక్షాన, ధర్మం వైపు ఉన్నాం. వైసీపీ తన తీరు మార్చుకోకపోతే కౌరవుల గతే పడుతుంది. ఇప్పటికైనా జగన్ తన ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసి, సభా గౌరవాన్ని కాపాడేలా చూడాలి. రాబోయే సమావేశాల్లోనైనా వారు పెద్దల సభ సభ్యుల్లా హుందాగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నాను" అని వర్ల రామయ్య పేర్కొన్నారు.