ఎల్బీనగర్లో విషాదం: ఏసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య
- విధి నిర్వహణలో ఉన్న జె. సాయి కుమార్ బలవన్మరణం
- 2024 బ్యాచ్కు చెందిన అధికారిగా గుర్తింపు
- ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసుల దర్యాప్తు
- పోలీస్ స్టేషన్ ఎదుట మృతుని కుటుంబ సభ్యుల ఆందోళన
హైదరాబాద్లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. మృతుడిని 2024 బ్యాచ్కు చెందిన జె. సాయి కుమార్గా గుర్తించారు.
వివరాల్లోకి వెళ్తే, సాయి కుమార్ ప్రస్తుతం ఈ-కాప్స్ విధుల్లో భాగంగా ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయానికి అటాచ్ అయి పనిచేస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో, విధుల్లో ఉన్న ఆయన కార్యాలయంలోని రెస్ట్ రూమ్లో బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఈ విషయాన్ని గమనించిన తోటి సిబ్బంది వెంటనే ఆయన్ను సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కర్మన్ఘాట్లో తన స్నేహితులతో కలిసి గదిలో నివసిస్తున్న సాయి కుమార్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతుని కుటుంబ సభ్యులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ విషాద ఘటనతో పోలీస్ శాఖలో విషాదఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే, సాయి కుమార్ ప్రస్తుతం ఈ-కాప్స్ విధుల్లో భాగంగా ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయానికి అటాచ్ అయి పనిచేస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో, విధుల్లో ఉన్న ఆయన కార్యాలయంలోని రెస్ట్ రూమ్లో బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఈ విషయాన్ని గమనించిన తోటి సిబ్బంది వెంటనే ఆయన్ను సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కర్మన్ఘాట్లో తన స్నేహితులతో కలిసి గదిలో నివసిస్తున్న సాయి కుమార్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతుని కుటుంబ సభ్యులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ విషాద ఘటనతో పోలీస్ శాఖలో విషాదఛాయలు అలుముకున్నాయి.