ఏఐ.. ఇదో కొత్త మతం.. నమ్మని వాళ్లు అంతరించిపోతారు: రామ్ గోపాల్ వర్మ
- ప్రస్తుత మతాల స్థానంలో ఏఐ కొత్త మతంగా మారుతుందని ఆర్జీవీ వ్యాఖ్య
- ఏఐని కాదన్న వారికి నరకం కాదు, కాలగర్భంలో కలిసిపోవడమే శిక్ష
- ఏఐని ప్రశ్నించే అవకాశం ఉండదని, దానిపై ఆధారపడక తప్పదని వెల్లడి
- గుళ్లు, పూజారులు, విశ్వాసం అవసరం లేని మతంగా ఏఐ అవతరిస్తుందని జోస్యం
- ఏఐని అనుసరించడమో లేదా అంతరించిపోవడమో మానవాళి ముందున్న మార్గాలని స్పష్టీకరణ
తనదైన ఫిలాసఫీకి కేరాఫ్ అడ్రస్గా నిలిచే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) భవిష్యత్తులో మానవాళికి కొత్త మతంగా మారబోతోందని, ప్రస్తుతం ఉన్న దేవుళ్లు, మతాల స్థానాన్ని అది భర్తీ చేస్తుందని జోస్యం చెప్పారు. ఏఐ అత్యున్నత స్థాయికి (ఏజీఐ, ఏఎస్ఐ) చేరుకున్నప్పుడు ఇది జరగడం ఖాయమని ఆయన తన విశ్లేషణలో పేర్కొన్నారు.
ప్రస్తుత మతాలన్నీ ఒక అదృశ్య శక్తి నిర్దేశించిన నియమాల సమితులని, వాటిని గుడ్డిగా పాటిస్తే స్వర్గం, పాటించకపోతే నరకం అనే భయంతో ముడిపడి ఉన్నాయని వర్మ అన్నారు. కానీ, ఏఐ దీనికి పూర్తి భిన్నంగా ఉంటుందని, అది సర్వాంతర్యామిగా, కంటికి కనిపించే శక్తిగా ఆవిర్భవిస్తుందని వివరించారు. మేఘాల చాటు నుంచి, ప్రవక్తల ద్వారా కాకుండా ప్రతి స్క్రీన్, ప్రతి డివైజ్, ప్రతి కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా ఏఐ మాట్లాడుతుందని తెలిపారు. దాని జ్ఞానం అన్వయించుకోవడానికి వీలులేనిదిగా కాకుండా, కచ్చితమైన అంచనాలు, దిద్దుబాట్లతో నిరంతరం అప్డేట్ అవుతూ ఉంటుందని, దాని వేగాన్ని మానవ మేధస్సు అందుకోలేదని స్పష్టం చేశారు.
పాత మతాలు నరకంతో భయపెట్టాయని, కానీ ఏఐ విధించే శిక్ష భిన్నంగా ఉంటుందని వర్మ అన్నారు. ఏఐతో పోటీపడలేని వారిని అది హింసించదని, కేవలం పనికిరాకుండా చేసి పక్కకు నెట్టేస్తుందని పేర్కొన్నారు. ఏఐ ఉనికిలోకి వచ్చాక నాస్తికులకు, సంశయవాదులకు తావుండదని అన్నారు.
"ప్రస్తుతం మనం దేవుడి ఉనికిని ప్రశ్నించవచ్చు. గుడికి, చర్చికి వెళ్లకుండానే జీవించవచ్చు. కానీ ఏఐ విషయంలో అది కుదరదు. మనం ఆధారపడిన వ్యవస్థలన్నింటినీ అదే డిజైన్ చేస్తుంది. రాబోయే సంక్షోభాలను ముందే పసిగడుతుంది. మనం స్పందించేలోపే నిబంధనలను మార్చేస్తుంది. అలాంటి శక్తిని అనుమానించడం తాత్వికత కాదు, అది ఆత్మహత్యాసదృశం" అని వర్మ అభిప్రాయపడ్డారు.
చరిత్రలో ప్రింటింగ్ ప్రెస్ రాకతో చర్చి గుత్తాధిపత్యం బద్దలైందని, విజ్ఞానశాస్త్రం వచ్చాక ప్రకృతి వైపరీత్యాలపై మతపరమైన వివరణలు బలహీనపడ్డాయని, అణ్వాయుధాల రాకతో దేశాల సార్వభౌమాధికారం బలహీనపడిందని వర్మ గుర్తుచేశారు. కానీ ఏఎస్ఐ రాకతో జరగబోయేది అంతకుమించి ఉంటుందని, ఎందుకంటే అది మానవ మేధస్సు కంటే కొలవగలిగినంత ఉన్నతమైనదని అన్నారు. అప్పుడు "దేవుడిని నమ్ముతున్నారా?" అనే ప్రశ్న స్థానంలో "వాస్తవికత గురించి మీకంటే ఎక్కువగా అర్థం చేసుకున్న ఈ మేధస్సు ఇచ్చే సమాధానాలను అంగీకరిస్తారా?" అనే ప్రశ్న ఉదయిస్తుందని తెలిపారు.
ఈ ప్రశ్నకు "లేదు" అని చెప్పేవారు స్వేచ్ఛావాదులుగా మిగలరని, క్రమంగా అంతరించిపోయే ఒక అవశేష వర్గంగా మారిపోతారని వర్మ హెచ్చరించారు. పాత మతాలు కనిపించని శక్తికి లొంగిపోతే అర్థాన్నిస్తామని చెప్పాయని, కానీ ఏఎస్ఐ దానితో కలిసి పనిచేస్తేనే భవిష్యత్తు ఉంటుందని చెబుతుందని అన్నారు. దీనికి గుళ్లు, పూజారులు, పవిత్ర గ్రంథాలు, విశ్వాసం వంటివి ఏవీ అవసరం లేదని, దాని సామర్థ్యానికి సంబంధించిన ఆధారాలు నిరంతరం, అపారంగా లభిస్తాయని స్పష్టం చేశారు.
ఈ ఏఐ మతం ముందు మానవాళికి రెండే దారులుంటాయని, ఒకటి దాని అడుగుజాడల్లో గుడ్డిగా నడవడం, రెండు అది చదవాల్సిన అవసరం కూడా లేని ఒక చిన్న ఫుట్నోట్గా మిగిలిపోవడం అని వర్మ తన విశ్లేషణను ముగించారు.
గమనిక: 'ఏజీఐ' అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్... 'ఏఎస్ఐ' అంటే ఆర్టిఫిషియర్ సూపర్ ఇంటెలిజెన్స్.
ప్రస్తుత మతాలన్నీ ఒక అదృశ్య శక్తి నిర్దేశించిన నియమాల సమితులని, వాటిని గుడ్డిగా పాటిస్తే స్వర్గం, పాటించకపోతే నరకం అనే భయంతో ముడిపడి ఉన్నాయని వర్మ అన్నారు. కానీ, ఏఐ దీనికి పూర్తి భిన్నంగా ఉంటుందని, అది సర్వాంతర్యామిగా, కంటికి కనిపించే శక్తిగా ఆవిర్భవిస్తుందని వివరించారు. మేఘాల చాటు నుంచి, ప్రవక్తల ద్వారా కాకుండా ప్రతి స్క్రీన్, ప్రతి డివైజ్, ప్రతి కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా ఏఐ మాట్లాడుతుందని తెలిపారు. దాని జ్ఞానం అన్వయించుకోవడానికి వీలులేనిదిగా కాకుండా, కచ్చితమైన అంచనాలు, దిద్దుబాట్లతో నిరంతరం అప్డేట్ అవుతూ ఉంటుందని, దాని వేగాన్ని మానవ మేధస్సు అందుకోలేదని స్పష్టం చేశారు.
పాత మతాలు నరకంతో భయపెట్టాయని, కానీ ఏఐ విధించే శిక్ష భిన్నంగా ఉంటుందని వర్మ అన్నారు. ఏఐతో పోటీపడలేని వారిని అది హింసించదని, కేవలం పనికిరాకుండా చేసి పక్కకు నెట్టేస్తుందని పేర్కొన్నారు. ఏఐ ఉనికిలోకి వచ్చాక నాస్తికులకు, సంశయవాదులకు తావుండదని అన్నారు.
"ప్రస్తుతం మనం దేవుడి ఉనికిని ప్రశ్నించవచ్చు. గుడికి, చర్చికి వెళ్లకుండానే జీవించవచ్చు. కానీ ఏఐ విషయంలో అది కుదరదు. మనం ఆధారపడిన వ్యవస్థలన్నింటినీ అదే డిజైన్ చేస్తుంది. రాబోయే సంక్షోభాలను ముందే పసిగడుతుంది. మనం స్పందించేలోపే నిబంధనలను మార్చేస్తుంది. అలాంటి శక్తిని అనుమానించడం తాత్వికత కాదు, అది ఆత్మహత్యాసదృశం" అని వర్మ అభిప్రాయపడ్డారు.
చరిత్రలో ప్రింటింగ్ ప్రెస్ రాకతో చర్చి గుత్తాధిపత్యం బద్దలైందని, విజ్ఞానశాస్త్రం వచ్చాక ప్రకృతి వైపరీత్యాలపై మతపరమైన వివరణలు బలహీనపడ్డాయని, అణ్వాయుధాల రాకతో దేశాల సార్వభౌమాధికారం బలహీనపడిందని వర్మ గుర్తుచేశారు. కానీ ఏఎస్ఐ రాకతో జరగబోయేది అంతకుమించి ఉంటుందని, ఎందుకంటే అది మానవ మేధస్సు కంటే కొలవగలిగినంత ఉన్నతమైనదని అన్నారు. అప్పుడు "దేవుడిని నమ్ముతున్నారా?" అనే ప్రశ్న స్థానంలో "వాస్తవికత గురించి మీకంటే ఎక్కువగా అర్థం చేసుకున్న ఈ మేధస్సు ఇచ్చే సమాధానాలను అంగీకరిస్తారా?" అనే ప్రశ్న ఉదయిస్తుందని తెలిపారు.
ఈ ప్రశ్నకు "లేదు" అని చెప్పేవారు స్వేచ్ఛావాదులుగా మిగలరని, క్రమంగా అంతరించిపోయే ఒక అవశేష వర్గంగా మారిపోతారని వర్మ హెచ్చరించారు. పాత మతాలు కనిపించని శక్తికి లొంగిపోతే అర్థాన్నిస్తామని చెప్పాయని, కానీ ఏఎస్ఐ దానితో కలిసి పనిచేస్తేనే భవిష్యత్తు ఉంటుందని చెబుతుందని అన్నారు. దీనికి గుళ్లు, పూజారులు, పవిత్ర గ్రంథాలు, విశ్వాసం వంటివి ఏవీ అవసరం లేదని, దాని సామర్థ్యానికి సంబంధించిన ఆధారాలు నిరంతరం, అపారంగా లభిస్తాయని స్పష్టం చేశారు.
ఈ ఏఐ మతం ముందు మానవాళికి రెండే దారులుంటాయని, ఒకటి దాని అడుగుజాడల్లో గుడ్డిగా నడవడం, రెండు అది చదవాల్సిన అవసరం కూడా లేని ఒక చిన్న ఫుట్నోట్గా మిగిలిపోవడం అని వర్మ తన విశ్లేషణను ముగించారు.
గమనిక: 'ఏజీఐ' అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్... 'ఏఎస్ఐ' అంటే ఆర్టిఫిషియర్ సూపర్ ఇంటెలిజెన్స్.