రాజమండ్రి ప్రమాద ఘటనలో గాయపడిన ప్రియాంక మృతి
- రాజమండ్రి రోడ్డు ప్రమాద బాధితురాలు, మెడికో ప్రియాంక చికిత్స పొందుతూ కన్నుమూత
- సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన వైనం
- మరణాన్ని ధ్రువీకరించిన వైద్యులు
- ప్రమాదానికి కారణమైన ఇద్దరు నిందితులు ఇప్పటికే అరెస్ట్
రాజమండ్రిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెడికో ప్రియాంక మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. గత ఐదు రోజులుగా సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం తుదిశ్వాస విడిచింది. ఓ వైద్యురాలిగా ఎంతో భవిష్యత్తు ఉన్న ప్రియాంక అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
వివరాల్లోకి వెళితే, ఆగస్టు 3వ తేదీన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ప్రసాదిత్యమాల్ ప్రాంతంలో ప్రియాంక తన స్కూటర్పై వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపిన సురవరపు దశ్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ అనే ఇద్దరు యువకులు ఆమె స్కూటర్ను ఉద్దేశపూర్వకంగా మూడుసార్లు ఢీకొట్టారు. ఈ ఘటనలో ప్రియాంక తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను రాజమండ్రిలోని స్థానిక ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు హైదరాబాద్లోని కిమ్స్కు తరలించారు.
అక్కడ ఆమెను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు. అయినప్పటికీ ఆమె కోలుకోలేకపోయింది. శుక్రవారం మధ్యాహ్నం 3:25 గంటలకు ప్రియాంక తుదిశ్వాస విడిచినట్టు కిమ్స్ వైద్యులు ప్రకటించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులు దశ్వంత్, ఆండ్రూలను ఇప్పటికే అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.
కాగా, తన కుమార్తె మృతికి కారణమైన వారిపై సాధారణ ప్రమాద కేసు కాకుండా, హత్య కేసు నమోదు చేయాలని ప్రియాంక తండ్రి డిమాండ్ చేశారు. ఇది కేవలం ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యేనని ఆయన ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా సీసీటీవీ ఫుటేజి పరిశీలించిన అనంతరం, కావాలనే ఢీకొట్టినట్టు గుర్తించారు. హత్యాయత్నం సెక్షన్లతో కేసును మరింత పకడ్డందీగా మార్చారు.
ప్రియాంక స్వస్థలం తెలంగాణలోని గద్వాల జిల్లా అయిజ మండలం ఎక్లాస్ పూర్. ఆమె ఎంబీబీఎస్ అనంతరం రాజమండ్రిలో పీజీ చేస్తోంది. ఇప్పుడు ఆమె మృతితో స్వగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
వివరాల్లోకి వెళితే, ఆగస్టు 3వ తేదీన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ప్రసాదిత్యమాల్ ప్రాంతంలో ప్రియాంక తన స్కూటర్పై వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపిన సురవరపు దశ్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ అనే ఇద్దరు యువకులు ఆమె స్కూటర్ను ఉద్దేశపూర్వకంగా మూడుసార్లు ఢీకొట్టారు. ఈ ఘటనలో ప్రియాంక తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను రాజమండ్రిలోని స్థానిక ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు హైదరాబాద్లోని కిమ్స్కు తరలించారు.
అక్కడ ఆమెను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు. అయినప్పటికీ ఆమె కోలుకోలేకపోయింది. శుక్రవారం మధ్యాహ్నం 3:25 గంటలకు ప్రియాంక తుదిశ్వాస విడిచినట్టు కిమ్స్ వైద్యులు ప్రకటించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులు దశ్వంత్, ఆండ్రూలను ఇప్పటికే అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.
కాగా, తన కుమార్తె మృతికి కారణమైన వారిపై సాధారణ ప్రమాద కేసు కాకుండా, హత్య కేసు నమోదు చేయాలని ప్రియాంక తండ్రి డిమాండ్ చేశారు. ఇది కేవలం ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యేనని ఆయన ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా సీసీటీవీ ఫుటేజి పరిశీలించిన అనంతరం, కావాలనే ఢీకొట్టినట్టు గుర్తించారు. హత్యాయత్నం సెక్షన్లతో కేసును మరింత పకడ్డందీగా మార్చారు.
ప్రియాంక స్వస్థలం తెలంగాణలోని గద్వాల జిల్లా అయిజ మండలం ఎక్లాస్ పూర్. ఆమె ఎంబీబీఎస్ అనంతరం రాజమండ్రిలో పీజీ చేస్తోంది. ఇప్పుడు ఆమె మృతితో స్వగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.