ఏజెంట్లను బయటకు పంపించి.. బీజేపీ అభ్యర్థిని పరుగెత్తించి కొట్టిన తృణమూల్ కార్యకర్తలు!
- బెంగాల్లోని కుమార్ గంజ్ నియోజకవర్గంలో ఘటన
- పలు పోలింగ్ కేంద్రాల్లో బీజేపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపించారని ఆరోపణ
- బూత్ నెంబర్ 24 వద్ద తనపై, బీజేపీ కార్యకర్తలపై దాడి జరిగిందన్న అభ్యర్థి
పశ్చిమ బెంగాల్లో తొలి విడత పోలింగ్ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చిన బీజేపీ అభ్యర్థిపై టీఎంసీ శ్రేణులు దాడి చేశాయి. కుమార్ గంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నుంచి సుబేందు సర్కారు పోటీ చేస్తున్నారు. ఆయన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చారు. ఈ సమయంలో టీఎంసీ కార్యకర్తలతో ఘర్షణ జరిగింది. దీంతో వారు బీజేపీ అభ్యర్థిని పరుగెత్తించి కొట్టారు. అతడి ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా టీఎంసీ కార్యకర్తలు ఆగలేదు.
మా ఏజెంట్లను బయటకు పంపించారు, నాపై దాడి చేశారు: సుబేందు సర్కార్
కుమార్ గంజ్లోని ఒక పోలింగ్ బూత్ వద్ద తనపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారని సుబేందు సర్కార్ ఆరోపించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లోని తమ ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బూత్ నెంబర్ 24 వద్ద తాను పరిశీలించడానికి వెళ్లిన సమయంలో టీఎంసీ కార్యకర్తలు తనపై, తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేశారని తెలిపారు. ఘటన జరిగినప్పుడు పోలింగ్ బూత్ వద్ద కేంద్ర బలగాలు లేవని చెప్పారు.
ఈ దాడిలో తనకు గాయాలయ్యాయని, తన వాహనాన్ని కూడా ధ్వంసం చేశారని మండిపడ్డారు. కుమార్ గంజ్ నియోజకవర్గంలో ఎనిమిది నుంచి పది పోలింగ్ కేంద్రాల్లో తమ పోలింగ్ ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపించారని ఆరోపించారు. తాను వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని, వారిని తిరిగి లోపలకు పంపించే ప్రయత్నం చేశానని అన్నారు. బూత్ నెంబర్ 24లోనూ తమ ఏజెంటును బయటకు పంపించడంతో తాను అడిగానని, దీంతో టీఎంసీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని అన్నారు. పోలింగ్ సమయంలో అధికార పార్టీ భయానక వాతావరణం సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా ఏజెంట్లను బయటకు పంపించారు, నాపై దాడి చేశారు: సుబేందు సర్కార్
కుమార్ గంజ్లోని ఒక పోలింగ్ బూత్ వద్ద తనపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారని సుబేందు సర్కార్ ఆరోపించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లోని తమ ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బూత్ నెంబర్ 24 వద్ద తాను పరిశీలించడానికి వెళ్లిన సమయంలో టీఎంసీ కార్యకర్తలు తనపై, తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేశారని తెలిపారు. ఘటన జరిగినప్పుడు పోలింగ్ బూత్ వద్ద కేంద్ర బలగాలు లేవని చెప్పారు.
ఈ దాడిలో తనకు గాయాలయ్యాయని, తన వాహనాన్ని కూడా ధ్వంసం చేశారని మండిపడ్డారు. కుమార్ గంజ్ నియోజకవర్గంలో ఎనిమిది నుంచి పది పోలింగ్ కేంద్రాల్లో తమ పోలింగ్ ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపించారని ఆరోపించారు. తాను వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని, వారిని తిరిగి లోపలకు పంపించే ప్రయత్నం చేశానని అన్నారు. బూత్ నెంబర్ 24లోనూ తమ ఏజెంటును బయటకు పంపించడంతో తాను అడిగానని, దీంతో టీఎంసీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని అన్నారు. పోలింగ్ సమయంలో అధికార పార్టీ భయానక వాతావరణం సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.