Nara Lokesh: గ్లోబల్ డిజిటల్ గేట్‌వేగా వైజాగ్‌.. భారీ ప్రాజెక్టుకు లోకేశ్ శంకుస్థాపన

Vizag to Become Global Digital Gateway Nara Lokesh Launches Project
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం గ్లోబల్ డిజిటల్ ప్రపంచంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా కీలక అడుగు వేసింది. నగరంలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఎడ్జ్‌ డేటా సెంటర్‌తో పాటు, ఓపెన్‌ కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్‌ ఏర్పాటుకు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ తాజాగా శంకుస్థాపన చేశారు.

నాస్‌డాక్‌లో నమోదైన ప్రముఖ డిజిటల్ ఐటీ సొల్యూషన్స్ సంస్థ సిఫీ టెక్నాలజీస్ ఈ భారీ ప్రాజెక్టును చేపడుతోంది. దాని అనుబంధ సంస్థ అయిన సిఫీ ఇన్ఫినిట్‌ స్పేసెస్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో 50 మెగావాట్ల సామర్థ్యంతో ఈ అత్యాధునిక డేటా సెంటర్‌ను నిర్మించనున్నారు. కేవలం డేటా సెంటరే కాకుండా, ఓపెన్‌ కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తుండటం విశేషం.

ఈ ప్రాజెక్టు కోసం సిఫీ సంస్థ రెండు దశల్లో సుమారు రూ.1,500 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. ఈ కేంద్రం పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత, దాదాపు వెయ్యి మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందని అంచనా. ఈ ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ ఏర్పాటుతో విశాఖ నగరం అంతర్జాతీయంగా ఒక కీలకమైన డిజిటల్ గేట్‌వేగా మారనుందని, ఇది రాష్ట్ర ఐటీ రంగ అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Go Back to Shorts
Nara Lokesh
Visakhapatnam
Vizag
Sify Technologies
Edge Data Center
Open Cable Landing Station
Andhra Pradesh IT
Artificial Intelligence
Digital Gateway
IT Hub

More Telugu News