Jagan: జగన్‌ను అందుకే ఇంటికి పంపారు: కొల్లు రవీంద్ర

Kollu Ravindra Slams Jagan
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అధినేత జగన్ పై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఐదేళ్ల జగన్ పాలనలో అరాచకాలను భరించలేకనే, ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇంటికి పంపారని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

శుక్రవారం విజయవాడలో పర్యటించిన సందర్భంగా కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. 'సూపర్ సిక్స్' పథకాలపై జగన్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే నాయకుడు చంద్రబాబు అని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఇటీవల నేపాల్‌లో జరిగిన దాడుల ఘటనను మంత్రి ప్రస్తావించారు. అక్కడ చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ వారిని మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చొరవ తీసుకుని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చారని కొల్లు రవీంద్ర తెలిపారు. చంద్రబాబు గతంలోనూ ఉత్తరాఖండ్ వరదల వేళ సాయం అందించారని, విశాఖపట్నంలో హుద్‌హుద్ తుపాను వంటి విపత్తుల సమయంలో క్షేత్రస్థాయిలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారని ఆయన గుర్తుచేశారు. ఆపద సమయంలో ప్రజలకు అండగా నిలవడం టీడీపీ ప్రభుత్వానికే సాధ్యమని ఆయన అన్నారు. 
Go Back to Shorts
Jagan
YS Jagan
Kollu Ravindra
Andhra Pradesh
Chandrababu Naidu
TDP
YS Jagan Government
Super Six Schemes
Nara Lokesh
Nepal Attacks

More Telugu News