Penguin Securities: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పేరుతో రూ. 150 కోట్ల భారీ మోసం

Penguin Securities 150 Crore Stock Market Investment Scam in Hyderabad
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ నగరంలో మరో భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి, ఏకంగా రూ.150 కోట్ల మేర కొల్లగొట్టిన ఉదంతం సంచలనం రేపుతోంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

చింతల్‌, గణేష్‌నగర్‌లో 'ది పెంగ్విన్ సెక్యూరిటీస్' అనే పేరుతో కొందరు మోసగాళ్లు ఒక సంస్థను ఏర్పాటు చేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలోనే మంచి రాబడి వస్తుందని ఆకర్షణీయమైన పథకాలతో ప్రచారం చేసి ప్రజలను నమ్మించారు. వీరి మాయమాటలు నమ్మిన సుమారు 1,500 మంది అమాయకులు తమ కష్టార్జితాన్ని ఈ సంస్థలో పెట్టుబడులుగా పెట్టారు. ఈ విధంగా మదుపర్ల నుంచి దాదాపు రూ.150 కోట్ల వరకు నిధులు సేకరించారు.

మదుపర్లకు నమ్మకం కలిగించేందుకు వారికి బాండ్ల రూపంలో కొన్ని పత్రాలను కూడా సంస్థ నిర్వాహకులు అందజేశారు. కొంతకాలానికి తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Go Back to Shorts
Penguin Securities
Hyderabad
Stock Market Scam
Gedimetla Police Station
Chintal

More Telugu News