Sunrisers Hyderabad: ఐపీఎల్: ఉప్పల్ స్టేడియంలో టాప్ 5 స్కోర్లు ఇవే!

- ఐదింట మూడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సాధించినవే!
- అత్యధిక స్కోర్... రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో 286 పరుగులు
- టాప్ ఫైవ్లో ముంబై ఇండియన్స్, పంజాబ్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో నమోదైన టాప్ ఫైవ్ స్కోర్లు ఒకసారి పరిశీలిద్దాం... ఈ ఐదు టాప్ స్కోర్లలో మూడు సన్ రైజర్స్వే కావడం విశేషం.
2025లో సన్ రైజర్స్ ఆటగాడు ఇషాన్ కిషన్ కేవలం 47 బంతుల్లో 106 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ 6 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్పై సన్ రైజర్స్కు ఇది రెండో అత్యధిక స్కోరు.
2024లో హెన్రిచ్ క్లాసన్ 34 బంతుల్లో 80 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. సన్ రైజర్స్ మూడు వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్తో సన్ రైజర్స్కు ఇది అత్యధిక స్కోరు.
2025లో సన్ రైజర్స్ ఆటగాడు అభిషేక్ శర్మ 55 బంతుల్లో 144 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. సన్ రైజర్స్ 2 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది.
2024లో ముంబై ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మ 34 బంతుల్లో 64 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 5 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది.
2025లో పంజాబ్ కింగ్స్ సారథి శ్రేయాస్ అయ్యర్ 36 బంతుల్లో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో పంజాబ్ 6 వికెట్లు నష్టపోయి 245 పరుగులు చేసింది.