జగన్ పై నల్లపాడు పీఎస్ లో కేసు నమోదు
- గుంటూరు మిర్చి యార్డులో జగన్ పర్యటన
- ఎమ్మెల్సీ కోడ్ ఉన్నా పర్యటనకు వచ్చారంటూ కేసు
- మరికొందరు వైసీపీ నేతలపైనా కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ నేపథ్యంలో, ఆయనపై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈసీ, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు బేఖాతరు చేస్తూ మిర్చి యార్డులో కార్యక్రమం నిర్వహించారంటూ... జగన్, అంబటి రాంబాబు, కొడాలి నాని, లేళ్ల అప్పిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నందిగం సురేశ్ తదితరులపై కేసు నమోదు చేశారు.