ఇల్లు, క్యాంపు కార్యాలయం కోసం.. పిఠాపురంలో మరో 12 ఎకరాలు కొన్న డిప్యూటీ సీఎం పవన్
- ఎన్నికల ముందు పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటానని అక్కడి ప్రజలకు మాటిచ్చిన జనసేనాని
- ఆ మాట ప్రకారం జులైలో ఇల్లింద్రాడ, భోగాపురంలో వరుసగా 2.08, 1.44 ఎకరాల కొనుగోలు
- ఇప్పుడు గతంలో కొన్నచోటే మరో 12 ఎకరాలు కొనుగోలు చేసిన పవన్
సోమవారం పిఠాపురంలో పర్యటించిన పవన్ గతంలో కొన్నచోటే మరోసారి 12 ఎకరాలు కొనుగోలు చేశారు. దీని రిజిస్ట్రేషన్ను ఆయన తరఫున రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్ తోట సుధీర్ మంగళవారం పూర్తి చేయడం జరిగింది. త్వరలోనే ఈ స్థలంలో ఇల్లు, క్యాంపు కార్యాలయం నిర్మించనున్నారని సమాచారం.