హీరోలు రానా, వెంకటేశ్ లకు ఎదురుదెబ్బ.. కేసు కొట్టివేతకు హైకోర్టు నిరాకరణ
- ఫిలింనగర్లోని ఆస్తి వివాదానికి సంబంధించి కేసు
- సివిల్ వివాదంతో పాటు క్రిమినల్ కేసు కూడా కొనసాగవచ్చన్న హైకోర్టు
- కింది కోర్టులో విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఆదేశం
ప్రముఖ సినీ నటులు వెంకటేశ్, రానా, దగ్గుబాటి అభిరామ్, నిర్మాత డి. సురేశ్ బాబులకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తమపై నమోదైన చోరీ, అతిక్రమణ కేసులను కొట్టివేయాలని కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. ఆస్తికి సంబంధించిన సివిల్ వివాదం పెండింగ్లో ఉన్నంత మాత్రాన, క్రిమినల్ కేసు విచారణను నిలిపివేయలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
హైదరాబాద్లోని ఫిలింనగర్లో గల డెక్కన్ కిచెన్ రెస్టారెంట్ ఆస్తికి సంబంధించి వ్యాపారవేత్త కోరె నందు కుమార్ ఈ కేసు దాఖలు చేశారు. తాను లీజుకు తీసుకున్న స్థలంలోని నిర్మాణాలను నిందితులు అక్రమంగా కూల్చివేశారని, చట్టవిరుద్ధంగా ప్రాంగణంలోకి ప్రవేశించి విలువైన వస్తువులను అపహరించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను, తన కుటుంబాన్ని బెదిరించడమే కాకుండా, కోర్టు స్టే ఉత్తర్వులు అమలులో ఉన్నప్పటికీ నిందితులు వాటిని బేఖాతరు చేశారని ఆరోపించారు.
ఈ వివాదం పూర్తిగా సివిల్ వ్యవహారమని, దీనిపై క్రిమినల్ విచారణ జరపడం సరికాదని దగ్గుబాటి కుటుంబ సభ్యులు, వారి అకౌంటెంట్ గడ్డం విశ్వనాథం హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ వాదనతో జస్టిస్ ఎన్. తుకారాంజీ ధర్మాసనం ఏకీభవించలేదు. ఒకే వివాదంలో సివిల్, క్రిమినల్ అంశాలు మిళితమై ఉండవచ్చని, నేరపూరిత చర్యలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు విచారణను అడ్డుకోలేమని కోర్టు స్పష్టం చేసింది.
ఫిర్యాదు, వాంగ్మూలాలు, ఫోటోలు, వీడియో సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కింది కోర్టు మెజిస్టేట్ ఈ కేసును విచారణకు స్వీకరించారని హైకోర్టు అభిప్రాయపడింది. లోతైన విచారణ ద్వారానే వాస్తవాలను తేల్చాల్సి ఉంటుందని, ప్రాథమిక దశలో సెక్షన్ 482 కింద కేసును కొట్టివేయలేమని వెల్లడించింది. ఈ తీర్పుతో నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసు విచారణ యధావిధిగా కొనసాగనుంది.
హైదరాబాద్లోని ఫిలింనగర్లో గల డెక్కన్ కిచెన్ రెస్టారెంట్ ఆస్తికి సంబంధించి వ్యాపారవేత్త కోరె నందు కుమార్ ఈ కేసు దాఖలు చేశారు. తాను లీజుకు తీసుకున్న స్థలంలోని నిర్మాణాలను నిందితులు అక్రమంగా కూల్చివేశారని, చట్టవిరుద్ధంగా ప్రాంగణంలోకి ప్రవేశించి విలువైన వస్తువులను అపహరించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను, తన కుటుంబాన్ని బెదిరించడమే కాకుండా, కోర్టు స్టే ఉత్తర్వులు అమలులో ఉన్నప్పటికీ నిందితులు వాటిని బేఖాతరు చేశారని ఆరోపించారు.
ఈ వివాదం పూర్తిగా సివిల్ వ్యవహారమని, దీనిపై క్రిమినల్ విచారణ జరపడం సరికాదని దగ్గుబాటి కుటుంబ సభ్యులు, వారి అకౌంటెంట్ గడ్డం విశ్వనాథం హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ వాదనతో జస్టిస్ ఎన్. తుకారాంజీ ధర్మాసనం ఏకీభవించలేదు. ఒకే వివాదంలో సివిల్, క్రిమినల్ అంశాలు మిళితమై ఉండవచ్చని, నేరపూరిత చర్యలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు విచారణను అడ్డుకోలేమని కోర్టు స్పష్టం చేసింది.
ఫిర్యాదు, వాంగ్మూలాలు, ఫోటోలు, వీడియో సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కింది కోర్టు మెజిస్టేట్ ఈ కేసును విచారణకు స్వీకరించారని హైకోర్టు అభిప్రాయపడింది. లోతైన విచారణ ద్వారానే వాస్తవాలను తేల్చాల్సి ఉంటుందని, ప్రాథమిక దశలో సెక్షన్ 482 కింద కేసును కొట్టివేయలేమని వెల్లడించింది. ఈ తీర్పుతో నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసు విచారణ యధావిధిగా కొనసాగనుంది.