Andhra Pradesh: ఏపీలో ఇద్దరు కీలక ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన ఎన్నికల సంఘం

  • ఏపీలో ఎన్నికల కోడ్ అమలు
  • నియమావళి ప్రకారం ముందుకు పోతున్న ఎన్నికల సంఘం
  • ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ
  • తాజాగా పీఎస్సార్ ఆంజనేయులు, కాంతిరాణా టాటాలను బదిలీ చేసిన ఈసీ
EC transfers two more IPS Officials in AP

ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. 

తాజాగా, ఇద్దరు సీనియర్ ఐపీఎస్ లను బదిలీ చేసింది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాలను బదిలీ చేస్తూ ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. 

ఆ ఇద్దరు ఐపీఎస్ లకు ఎన్నికల విధులతో సంబంధంలేని బాధ్యతలు అప్పగించాలని, వారి స్థానంలో కొత్తవారిని నియమించాలంటూ ఈసీ తన ఆదేశాల్లో ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. 

ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఇటీవల ఈసీకి రాసిన లేఖలో రాష్ట్రంలోని పలువురు ఐపీఎస్ అధికారుల తీరును వివరించినట్టు తెలుస్తోంది.

More Telugu News