మాయమాటలు చెప్పి మోసం చేసేవారి మాటలు నమ్మకండి: మంత్రి మల్లారెడ్డి
- సీఎం కేసీఆర్ అందించిన పథకాలతో ప్రతి ఇంటికి లబ్ధి చేకూరిందన్న మంత్రి
- అభివృద్ధిని చూసి ఓటేయాలని సూచన
- ఇతర రాష్ట్రాల వారు మన అభివృద్ధిని చూసి నేర్చుకునే విధంగా పని చేశామన్న మల్లారెడ్డి
తండాలను, పల్లెలను సీఎం కేసీఆర్ పంచాయతీలుగా మార్చారని, దీంతో అవి అభివృద్ధి పథంలో సాగుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్లకు పైగా పాలించి ప్రజలను వంచించి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందన్నారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే, మరో అయిదేళ్లు ప్రజలకు సేవ చేస్తానన్నారు. తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. మేడ్చల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి మల్లారెడ్డి పోటీ చేస్తున్నారు.