Dhulipala Narendra Kumar: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు ప్రభుత్వం నోటీసులు

Govt notices to TDP leader Dhulipalla Narendra
  • నోటీసులు జారీ చేసిన దేవాదాయశాఖ కమిషనర్
  • సెక్షన్ 6-ఏ కింద నోటీసులు
  • ట్రస్టు స్వాధీనంపై వివరణ కోరిన వైనం
  • వారం రోజుల్లో నోటీసులపై స్పందించాలని స్పష్టీకరణ

టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు ఏపీ ప్రభుత్వం తాజాగా నోటీసులు పంపింది. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ను స్వాధీనం చేసుకునే క్రమంలో నోటీసులు జారీ చేసింది. సహకార చట్టంలోని సెక్షన్ 6-ఏ కింద ట్రస్టును ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. కాగా ఈ నోటీసులను రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హరిజవహర్ లాల్ జారీ చేశారు. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. ధూళిపాళ్ల ట్రస్టు ఆధ్వర్యంలో డీవీసీ ఆసుపత్రి నడుస్తోంది.

  • Loading...

More Telugu News