Advertisement

ఢిల్లీలో వేగంగా మారిన రాజకీయం.. హుటాహుటిన హస్తినకు మహారాష్ట్ర సీఎం?

Politics change rapidly in Delhi Maharashtra CM rushes to capital
  • కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆకస్మిక రాజీనామా
  • కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ప్రచారం
  • ఢిల్లీకి మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంల పయనం
  • ప్రధాని మోదీ, అమిత్ షా అత్యవసర భేటీ
  • జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయడంతో దేశ రాజధాని ఢిల్లీ వేదికగా రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు ఇతర రాష్ట్రాల రాజకీయాలపైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధిష్ఠానం రంగంలోకి దిగి తదుపరి వ్యూహాలపై దృష్టి సారించింది.

ఈ క్రమంలో అధిష్ఠానం అత్యవసర పిలుపు మేరకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో మార్పులతో పాటు రాష్ట్ర రాజకీయ వ్యూహాలు, మిత్రపక్షాల సర్దుబాట్లపై వీరితో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యవసరంగా భేటీ అయ్యారు. ప్రధాన్ రాజీనామా, తదుపరి కార్యాచరణ, దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం. దీంతో దేశ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Advertisement
Dharmendra Pradhan
Eknath Shinde
Devendra Fadnavis
Cabinet Reshuffle
Narendra Modi Amit Shah
Delhi Political News

More Telugu News